Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్ర నూతన విద్యావిధానం ఏకపక్షం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

కేంద్ర నూతన విద్యావిధానం ఏకపక్షం

- ఢిల్లీ తరహా విద్యావిధానమైతే ఆమోదిస్తా..
- రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలి
- ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
నూతన విద్యావిధానాన్ని కేంద్రం ఏకపక్షంగా తెచ్చిందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. శనివారం ఢిల్లీలోని మోడీబాగ్‌లో సర్వోదయ స్కూల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాతో కలిసి ఆయన సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి తాము అనుసరిస్తున్న కాన్సెప్ట్‌ను, ప్రతి ఏడాది ఖర్చు పెడుతున్న బడ్జెట్‌ తదితరాలను సీఎం కేసీఆర్‌కు వివరించారు. 30 నిమిషాలపాటు ఏర్పాటు చేసిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కేసీఆర్‌ తిలకించారు. విద్యాభివృద్ధి కోసం కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, స్కూల్‌ కరిక్యులమ్‌ను అక్కడి అధికారులు చంద్రశేఖర్‌రావుకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ తరహా విద్యావిధానమైతే తాను ఆమోదిస్తానని స్పష్టం చేశారు. నూతన విద్యా విధానంపై కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో విద్యావిధానముందనీ, అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన బాగుందనీ, విద్యార్థులు ఉద్యోగాలిచ్చే వారిగా మారుతున్నారని అభినందించారు. తెలంగాణ అధికారులను, ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపించి రాష్ట్రంలో విద్యావిధానాన్ని మారుస్తామని ప్రకటించారు. ఏ రాష్ట్రమైనా ప్రజల కోసం మంచి పనులు చేస్తుంటే వాటిని తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఐదేండ్ల క్రితం ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ల గురించి తెలుసుకుని 350 బస్తీ దవాఖానాలు ప్రారంభించామని చెప్పారు. మొహల్లా క్లినిక్‌లు బాగున్నాయనీ, ప్రతి రోజు 90 నుంచి 105 మంది వరకు రోగులను చూస్తున్నారని చెప్పారు.
కేసీఆర్‌కు విద్యావిధానంపై ఎంతో ఆసక్తి....కేజ్రీవాల్‌
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు విద్యావిధానంపై ఎంతో ఆసక్తి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కొనియాడారు. ఢిల్లీ స్కూల్‌ను సందర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల గదులన్నీ పరిశీలించారనీ, ఒక్కో ప్రశ్న అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
ప్రముఖులతో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఆర్థికవేత్తలు, రాజకీయ, మీడియా రంగ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఆయన దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికకుటుంబాలను కలిసి ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్‌కు చేరుకుని రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 కుటుంబాలను పరామర్శిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.మూడు లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయనతో పాటు ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్సింగ్‌ కూడా పాల్గొననున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం కేసీఆర్‌ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌ తిరిగి రానున్నారు. ఆ తర్వాత 29, 30 తేదీల్లో బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్‌ భేటీ
ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్‌ యాదవ్‌ కేసీఆర్‌తో ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌-23లోని కేసీఆర్‌ నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల గురించి వారి మధ్య ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తున్నది. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరంపై వారివురు చర్చించినట్టు తెలిసింది.
అనంతరం మీడియా ప్రతినిధులు సమావేసం వివరాలడిగితే సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, అది చిన్న విషయమనీ, దేశ రాజకీయాల్లో సంచలనం జరగబోతున్నదని చెప్పారు. ఈ సమావేశంలో కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలవకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూలుస్తామని తీర్మానిస్తారా?
పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి
టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?
ఎకో-టూరిజానికి భారీ ప్రణాళికలు
'కొరటాల' వల్లే మన పత్రికలు ఈ స్థాయిలో ఉన్నాయి
అరాచకాలు హద్దులు దాటుతున్నాయి
టెట్‌లో మిశ్రమ ఫలితాలు
4న ఎఫ్‌టిసిసిఐ అవార్డుల ప్రదానం
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
అత్యవసర సేవలు బంద్‌
తెరుచుకున్న బాబ్లీగేట్లు
'సికింద్రాబాద్‌'లో అరెస్టయిన యువతకు బెయిల్‌ ఇప్పించాలి
రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు
విభజన చట్టంలోని హామీలను అమలు చేయండి
వర్గీకరణ కోసం రూట్‌మ్యాప్‌ ప్రకటించాలి
బొల్లారంలో 'ఉషోదయ సూపర్‌ మార్కెట్‌' ప్రారంభం
డాక్టర్‌ ఆనంద్‌కు ఉత్తమ డాక్టర్‌ ప్రశంసా పత్రం
కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల కొట్లాట
తిరుమల వెంకన్న దర్శనం కావాలా...
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఊకదంపుడు ఉపన్యాసాలొద్దు.. బియ్యం కొనండి
జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమం:టీడబ్ల్యూజేఎఫ్‌
అసంపూర్తిగా ముగిసిన జేబీసీసీఐ సమావేశం
వైద్యో నారాయణో హరి...
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి
రాష్ట్రంలో 1.81 శాతం పాజిటివ్‌ రేటు
'గురుకులం'లో 18 మంది విద్యార్థులకు కరోనా
జమునా హేచరీస్‌ భూమిపై తీర్పు వాయిదా
19 సంస్థలకు ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్సీ అవార్డులు
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

తాజా వార్తలు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

09:02 AM

నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు

08:58 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:51 AM

గూగుల్‌ మరో కీలక నిర్ణయం

08:41 AM

సినీఫక్కీలో చోరీ.. తుపాకీతో బెదిరించి..

08:30 AM

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

08:15 AM

పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌

08:08 AM

వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

08:01 AM

మోడీకి కేటీఆర్ బహిరంగ లేఖ

07:47 AM

ఇరాన్‌లో భారీ భూకంపం

06:50 AM

రేపు పలు ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.