Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తగ్గిన సాగు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Aug 06,2022

తగ్గిన సాగు

- అధిక వర్షాలు, వరదలే కారణం
- గతేడాది 95 లక్షల ఎకరాల్లో
- ఈసారి 80.85 లక్షల ఎకరాల్లోనే పంటలు
- 15 లక్షల ఎకరాల్లో పంటలే వేయలే
- వరి, పత్తి తగ్గిన వైనం
- ఆహార పంటలు సైతం వెనకపట్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
              రాష్ట్రంలో సాగు ఆందోళనకరంగా మారుతున్నది. భారీ వర్షాలు, వరదలు పొటెత్తటంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. వానాకాలం సీజన్‌లో పంటలు పూర్తి కాలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సగానికి సగం సాగు తగ్గిపోయింది. క్రమంగా వర్షాలు తగ్గుతున్నప్పటికీ విత్తనం వేసేందుకు సమయం మించిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసీజన్‌లో వేసే పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌ పంటలకు ప్రత్యామ్నాయంగా వేసే అవకాశమూ లేదు. ప్రకృతివైపరీత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక భారంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదితో పొల్చితే 83శాతం వర్షాపాతం అధికంగా ఉన్నది. భూగర్భజలాలు పెరిగినప్పటికీ అవి పంటలకు మాత్రం అనుకూలంగా లేని పరిస్థితులు నెలకొన్నాయి. కుండపోత వానలు కురిసి నేలలు తడి ఆరకపోవడంతో పంటలకు అనుకూలంగా లేవు. ఒకవేళ ఆరుతడి పంటలు వేసినా అవి దిగుబడి వచ్చే పరిస్థితి లేవు. యాసంగి సీజన్‌ వరకు ఎదురుచూడాల్సిందే. ఈ నేపథ్యంలో రైతులు భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తున్నది.
              రాష్ట్రంలో సాగుయోగ్యమైన నేల కోటి 23 లక్షల ఎకరాలున్నది. అందులో ఈ సమయానికి 89.22 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. గతేడాది ఈ సమయానికి రూ 96.92 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 80.85 లక్షల ఎకరాల్లో పంటలేశారు. అధిక వర్షాల కారణంగా అదును అనుకూలించకపోవడంతో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. అందులో ప్రధాన పంటైన వరి మాత్రం గతేడాది 25.22 లక్షల సాగు చేయగా, ఈసారి 18 లక్షల ఎకరాల్లోనే వరి నాటారు. దీంతో వ్యవసాయ శాఖ ఆగస్టు పూర్తయ్యేనటికి సాగు అయ్యే పరిస్థితులు లేవు. దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో అది తగ్గిపోయింది. మరోవైపు రాష్ట్రంలో సాధారణంగా పత్తి 50 లక్షల ఎకరాల్లో వేస్తారు. ఇప్పటికి 45.42 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఐదారు లక్షల ఎకరాల్లో పత్తి వేసేందుకు అవకాశం లేకుండాపోయింది. వానాకాలం సీజన్‌ ప్రారంభంలో వానలు ఆలస్యం కావడం, ఆ తర్వాత పంటలు వేసే సమయానికి భారీ వర్షాలు పడటం ఆందోళనకరం. దీంతోపాటు పొడి వాతావరణంలోనే పొద్దుతిరుగుడు దిగుబడి వస్తున్నది. అది కూడా వేయలేదు. ఆముదానికి మాత్రం తొలకరి ప్రారంభంలో విత్తనం వేయడం ద్వారా ఫలితం ఉంటుంది.
              జొన్న పంటకు తెలంగాణ నేలలు ప్రసిద్ధి. దాదాపు 95వేల ఎకరాల్లో ఆ పంటను వేసారు. కానీ 25వేల ఎకరాలకు పరిమితమైంది. పత్తి తర్వాత వాణిజ్య పంటగా ఉన్న మొక్కజొన్న రాష్ట్రంలో దాదాపు 82 ఎకరాల్లో సాగవుతున్నది. నేటికి 42వేల ఎకరాల్లో సాగై, 50శాతానికి పడిపోయింది. రాగి పంట 193 ఎకరాల్లో సాగైంది. గతేడాదితో పోల్చితే కంది 63.13 శాతం, పెసర కేవలం 37 శాతం, ఉల్వలు 56 శాతమే సాగయ్యాయి. ఉన్నంతలో సోయాబీన్‌ పంట ఆశాజనకంగా ఉంది. అయిల్‌ సీడ్‌ విత్తన సాగులోనూ ఇదే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతియేటా 20వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, కేవలం 6244 ఎకరాల్లోనే సాగైంది. అయితే జిల్లాల వారీగా సాగులో వ్యత్యాసం కనపడుతున్నది. ఆదిలాబాద్‌, కొమురంబీమ్‌ ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వికరాబాద్‌, రాజన్నసిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, జనగాం వరంగల్‌, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో సాగైంది. సూర్యాపేట, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌ జిల్లాల్లో 30 శాతానికి మించలేదు. ఆదిలాబాద్‌ జిల్లాల్లో వందశాతం దాటింది. మిగతా జిల్లాల్లో సగానికి మించకపోవడంతో ఆహార పంటలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు 'జనమేల్కొలుపు'
పంద్రాగస్టుకు గోల్కొండ కోట ముస్తాబు
జాతీయ జెండాలను ఎగురేద్దాం
వజ్రోత్సవాల్లో ప్రజలంతా పాల్గొనాలి..
విద్యా వ్యవస్థలో భూస్వామ్య భావజాలం
కమీషన్ల కోసమే 'కాళేశ్వరం' డిజైన్‌ మార్పు
ముందు సైన్యంలో ఖాళీలు భర్తీ చేయండి..
పంద్రాగస్టు వచ్చినా యూనిఫారాలు అందలే
పాతాళ గంగ పైపైకి..
భద్రాద్రి పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దాం
కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఉచితం కాదా?
మరో పథకం
మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట
వీఆర్‌ఏల వివరాలివ్వండి
ఎన్‌ఈపీ, ఎన్‌పీఎస్‌ రద్దు కోరుతూ రాష్ట్రపతికి వినతి
ప్రగతి భవన్‌లో రక్షానుబంధం
నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు
మునుగోడు ఆత్మగౌరవానికి, కేసీఆర్‌ కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో విస్టాడోమ్‌ కోచ్‌
ఉపాధి హామీ పనిదినాలు పెంచాలి
16న సామూహిక జాతీయ గీతాలాపన
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
మొక్కలు నాటడమంటే ఆక్సిజన్‌ను అందించడమే
పోడు భూముల్లో ప్లాంటేషన్‌ ఆపాలి
కృష్ణమ్మ ఉరకలు..
మహిళాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
త్రివర్ణమైన కరీం'నగరం'
15 నుంచి కొత్త పింఛన్లు
ఏజెన్సీలో గోదావర్రీ
మూసీ ప్రక్షాళన కోసం సీపీఐ(ఎం) పోరుబాట

తాజా వార్తలు

09:55 PM

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు ఆమోదం

09:47 PM

క్రీడాకారిణికి వేధింపులు.. నిందితుడు అరెస్టు

09:40 PM

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు రద్దు

09:33 PM

మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డ కేటీఆర్

09:23 PM

నల్లగొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య

09:08 PM

తెలంగాణలో కొత్తగా 440 కరోనా కేసులు

09:03 PM

ఏపీ ఆనకట్టల నిర్మాణానికి తమిళనాడు అభ్యంతరం

08:47 PM

రేపటి నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్ 1

08:39 PM

హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:09 PM

2023 డిసెంబర్ నుంచి అయోధ్య రాముడి దర్శనం..

07:58 PM

న్యూడ్‌ ఫోటో షూట్‌పై ర‌ణ్‌వీర్‌కు స‌మ‌న్లు‌

07:27 PM

తెలంగాణలో సెప్టెంబర్ నుంచి న్యూట్రీషన్‌ కిట్‌

07:21 PM

రూ. 20 కోసం 22 ఏండ్ల పాటు న్యాయ పోరాటం

07:14 PM

ఉగ్రవాద సంస్థ చీఫ్ కుమారుడిపై వేటు

06:55 PM

ఏపీలో భూకంపం

06:35 PM

ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయంటే..!

06:11 PM

పాకిస్థాన్ జెండా ఎగరేసిన యువకుడి అరెస్ట్

06:06 PM

రిజర్వాయర్‌లో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

05:33 PM

28న నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేత

05:27 PM

సికింద్రాబాద్-తిరుప‌తి మ‌ధ్య‌ ప్ర‌త్యే‌క రైళ్లు‌

05:05 PM

కాల్పులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

04:58 PM

అలాగైతే నేనూ రాజీనామా చేస్తా : ఎంపీ వెంకటరెడ్డి

04:26 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కాల్పుల కలకలం

04:17 PM

ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

03:41 PM

రుణ రికవరీ ఏజెంట్లకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు

03:32 PM

దుస్తులు, షూలో రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా..!

03:04 PM

రాజ్‌గోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు..

02:51 PM

ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం

02:41 PM

నల్లగొండ అభివృద్ధికి నిధులు విడుదల

02:36 PM

కాంగ్రెస్ ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జీగా ప్రియాంకా గాంధీ..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.