Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేటి నుంచి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

నేటి నుంచి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ

- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆహ్వానం సంఘం
- సభాస్థలాన్ని పరిశీలించిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
- నేడు జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన
- 30 వేల మందితో ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ
నవతెలంగాణ- నల్లగొండ
          పోరాటాల గడ్డ నల్లగొండ జిల్లా రైతు ఉద్యమ కార్యాచరణకు వేదికైంది. వ్యవసాయ జిల్లాగా పేరొందిన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభ జరగనుంది. ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతున్న రైతు వేడుకకు అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టిన రైతు ఉద్యమాలపై సమీక్షించుకోవడంతోపాటు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణను మహాసభలో రూపొందించనున్నారు. రైతాంగ సమస్యలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ మహాసభ ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని ఏచూరిగార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న మహాసభలో 800 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఆదివారం జరిగే బహిరంగసభకు 30 వేలమంది రైతులు తరలిరానున్నారు. దీనికి జాతీయ స్థాయి నాయకులూ హాజరవుతున్నారు. మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ పది రోజులుగా నగరంలో సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను రైతుసంఘం, మహాసభ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో మహాసభకు సంబంధించిన ప్లెక్సీలను ఏర్పాటు చేసి వివిధ కూడళ్లలో గోడరాతలు రాశారు. బహిరంగసభ జరిగే ఎన్‌జీ కళాశాల మైదానం వద్ద, ప్రతినిధుల సభ జరిగే ఏచూరిగార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌ను స్వాగత తోరణాలతో సిద్ధం చేశారు.
మహాసభ కార్యక్రమ వివరాలు..
          మహాసభ మొదటి రోజు 27న నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగసభ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలో రైతుప్రదర్శన ఉంటుంది. కలెక్టరేట్‌ ఎదురుగా ఎఫ్‌సీఐ రోడ్‌ నుంచి ప్రకాశంబజార్‌ మైసయ్య విగ్రహం పెద్దగడియారం మీదుగా ఎన్‌జీ కళాశాల మైదానానికి చేరనుంది. అనంతరం అక్కడ సభ ప్రారంభం కానుంది. మహాసభ జరిగే ప్రాంతాన్ని వీరనారి మల్లు స్వరాజ్యం నగరంగా నామకరణం చేశారు. మహాసభకు ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ దావలె, ప్రధానకార్యదర్శి హన్నన్‌మొల్లా, జాతీయ సహాయ కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌, ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, ఆహ్వానసంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి హాజరవుతున్నారు.
28న ఉదయం నుంచి ప్రతినిధుల సభ ఏచూరిగార్డెన్‌ ఫంక్షన్‌హాలులో ప్రారంభం కానుంది. ఈ వేదికకు మాలి పురుషోత్తంరెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంగా నామకరణం చేశారు. 29న 'వ్యవసాయ సమస్యలు-ఐక్యఉద్యమాలు- ఆవశ్యకత' అంశంపై సదస్సు జరగనుంది. ఇదే సమయంలో వామపక్ష రైతు సంఘాల సందేశాలు ఉంటాయి. మధ్యాహ్నం చర్చలు, వివిధ అంశాలపై తీర్మానాలు ఉండనున్నాయి. అనంతరం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికతో మహాసభ ముగుస్తుంది.
సభావేదికను పరిశీలించిన జూలకంటి
          ఎన్జీ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభ వేదిక, ఏచూరి గార్డెన్‌లో ప్రతినిధుల సభ ఏర్పాట్లను శనివారం ఆహ్వానసంఘం అధ్యక్షులు, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఆహ్వాన సంఘం సభ్యులు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, సయ్యద్‌హాషం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, ఎండి.సలీం, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ తదితరులు ఉన్నారు.
మహాసభకు సంబంధించి అన్ని పూర్తి చేసినట్టు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మండల, గ్రామాల్లో ప్రచారం నిర్వహించినట్టు చెప్పారు. బహిరంగసభకు రైతులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నా మన్నారు. భారీ ప్రదర్శనలో కోలాటం, పలు రకాల వేషధారణలతో కళాకారులు పాల్గొంటారని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష

తాజా వార్తలు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

03:25 PM

ముడి చమురు ధర తగ్గినా పెట్రో ధరల పెంపు ఎవరి కోసం మోడీజీ : కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.