Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎయిర్‌పోర్టు దగ్గర భూగర్భ మెట్రో | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

ఎయిర్‌పోర్టు దగ్గర భూగర్భ మెట్రో

- 2.5కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ నిర్మించే దిశగా ప్రణాళిక
- అక్కడే ఎయిర్‌పోర్ట్‌ లగేజ్‌ చెకిన్‌ ఉండేలా ఏర్పాట్లు
- ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ కనెక్టివిటీతో వరల్డ్‌ క్లాస్‌ సిటీగా హైదరాబాద్‌
- అయిదేండ్లుగా విజయవంతంగా నడుస్తున్న మెట్రో రైలు
- హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడి
- ఘనంగా మెట్రో రైల్‌ 5వ వార్షికోత్సవం
నవతెలంగాణ-సిటీబ్యూరో
శంషాబాద్‌ విమానాశ్రయానికి దగ్గరలో 2.5 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్‌ మెట్రో రైలు మార్గం నిర్మాణం చేయనున్నట్టు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. సెకండ్‌ ఫేజ్‌లో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు చేపట్టనున్న 31 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌లో భాగంగా ఈ నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇక్కడే ఎయిర్‌పోర్ట్‌ లగేజ్‌ చెక్‌ ఇన్‌ ఉండేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభమై ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో మంగళవారం హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జానపద గీతాలు, ఒగ్గుకళాకారుల నృత్యాలు, సితార్‌, సరోద్‌ ప్రదర్శనలు జరిగాయి. అనంతరం మీడియా సమావేశంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడారు.
2017 నవంబర్‌ 28న ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించామని, మొదటి రోజునే రెండు లక్షల మంది ప్రయాణించి దేశ చరిత్రలో రికార్డు సృష్టించారన్నారు. ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న తరుణంలో కొవిడ్‌ ఊహించని నష్టాన్ని తీసుకొచ్చిందని, 6 నెలలపాటు మెట్రో కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఎల్‌అండ్‌టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎల్‌అండ్‌టీ గట్టిగా నిలబడి ప్రజలకు మెరుగైనా రవాణా అందిస్తుండటం అభినందనీయమన్నారు. ఐదేండ్లు పూర్తయిన తరుణంలో సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4.40 లక్షల మంది ప్రయాణించారని, భవిష్యత్తు లో ఇంకా పెరిగే అవకాశముందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో(పీపీపీ) నడిచే మెట్రో రైళ్లు లేవని.. ఒక్క హైదరాబాద్‌లోనే ఉందని తెలిపారు. నగరానికి మెట్రో రైలును తీసుకొస్తానని చెబితే అప్పట్లో ఎవరూ నమ్మలేదని.. కానీ పట్టుదలతో, ప్రభుత్వాల సహకారంతో తీసుకొచ్చామని చెప్పారు.
రెండో ఫేజ్‌లో భాగంగా రూ.6,250 కోట్లతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని తెలిపారు. వచ్చే నెల 9న ఈ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని, పనులు పూర్తయితే హైదరాబాద్‌ మెట్రో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నగరాల్లో ఒకటిగా నిలిచిపోతుందన్నారు. నాగోలు- రాయదుర్గం బ్లూలైన్‌ కారిడార్‌ అనుసంధానంగా ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ నిర్మాణం ఉంటుందని, రాయదుర్గం స్టేషన్‌కు సుమారు 0.9 మీటర్ల ముందు ఒక స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్కడి నుంచి బయోడైవర్సిటీ, ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ మీదుగా ఔటర్‌రింగ్‌ రోడ్డు పక్క నుంచి పనులు చేపడతామన్నారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మాణం సమయంలో మెట్రో అవసరాలకు 500 అడుగుల స్థలాన్ని రైట్‌వే కింద వదిలేయడంతో పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పార. మొత్తం 31 కిలోమీటర్ల మార్గంలో 28.5 కిలోమీటర్లు మెట్రో పిల్లర్లపై ట్రాక్‌ వెళ్తుందని, మిగతా 2.5 కిలోమీటర్లు శంషాబాద్‌ వద్ద అండర్‌ గ్రౌండ్‌ ట్రాక్‌ ఉంటుందని వివరించారు. ప్రయాణికులు రాయదుర్గం స్టేషన్‌లోనే లగేజీలను ఒకేసారి చెకిన్‌ చేసుకోవడం ద్వారా ఎయిర్‌పోర్టులో ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.
ఎంజీబీఎస్‌ స్టేషన్‌ ప్రారంభ సమయంలోనే సీఎం కేసీఆర్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం రైలు నడిపిస్తే బాగుంటుందని తనతో చెప్పారని, అనుకున్న విధంగా ప్రభుత్వం ముందుకురావడం సంతోషకర మన్నారు. రెండో దశ పనులకు కేంద్రం సహకారం అందించినా.. అందించకపోయనా తామే పనులు చేపడుతామని మంత్రి కేటీఆర్‌ చెప్పారన్నారు.
5ఏండ్లు.. 31 కోట్ల మంది ప్రయాణం
మెట్రో ప్రారంభమైన ఈ ఐదేండ్ల కాలంలో మెట్రో మూడు కారిడార్లలో దాదాపు 31 కోట్ల మంది ప్రయాణం చేసినట్టు ఎల్‌అండ్‌టీ సీఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో సమయపాలనతో ప్రతిరోజూ రైళ్లను నడిపిస్తున్నామని, మెట్రో సూపర్‌ సేవర్‌, హాలీడే, టాప్‌ అప్‌ కార్డులు, ఫోన్‌పేతో మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ ద్వారా 40 శాతం మంది రాకపోకలు సాగిస్తున్నారని, సూపర్‌ సేవల్లో సర్వర్‌ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కియోలిస్‌ సంస్థ సహకారంతో ప్రయాణికులకు సులభతర టికెటింగ్‌ను అందిస్తున్నామన్నారు. అనంతరం మెట్రో ప్రయాణాలు చేస్తున్న మొదటి 15 మందిని, ఫోన్‌పే ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకుని ప్రయాణిస్తున్న మరో 10 మందిని రూ.10 వేల పారితోషికం, మెమెంటోతో సత్కరించారు. ఈ సమావేశంలో కీయొలిస్‌ సీఈవో బెర్నార్డ్‌ టాబెరీ, ఫోన్‌పే డైరెక్టర్‌ రితురాజ్‌ రౌతేజా తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌ ఎండీగా ఎన్వీఎస్‌ రెడ్డి..?
హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌) ఎండీగా ప్రభుత్వం బహుషా తననే నియమించే అవకాశాలు ఉన్నట్టు ఎన్వీఎస్‌ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. నగరంలో తొలిదశలో 69.9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణాన్ని విజయవంతంగా తన హయాంలో పూర్తయిందని.. రెండో దశలో ప్రభుత్వం రాయదుర్గం స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు చేపట్టనున్న 31 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌కు తనకే బాధ్యతలు అప్పజెప్పవచ్చునన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మూగబోయిన సుమధురవాణి
దేశమంటే అదానీ ప్రధానే కాదు
పేదలందరికీ ఇండ్లస్థలాలివ్వాలి
అక్బర్‌ వర్సెస్‌ కేటీఆర్‌
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి
ఆమెకేది రక్షణ!
పోడు భూముల ప్రస్తావనేది?
మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంపు
భాషాపండితులకు న్యాయం చేస్తాం
ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వండి
కోవిడ్‌ తర్వాత పెరిగిన తుంటి సమస్యలు
వ్య.కా.స. జాతీయ మహాసభలు జయప్రదం చేయండి
సమాజంలో సంస్కృతీసంప్రదాయాల పాత్ర కీలకం
పేదల కడుపు కొట్టి పెద్దలకు
తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు కేటాయించరా?
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపలేను....
విలేకరిపై దాడిని ఖండించిన తమ్మినేని
బడ్జెట్‌లో ఓయూకు రూ.1000 కోట్లు కేటాయించాలి
ఎన్‌డీసీఏ జాతీయ అవార్డులు అందుకున్న శ్రీచైతన్య
విద్యకు 24 శాతం, వైద్యానికి 12 శాతం నిధులు కేటాయించాలి
పీడీఎస్‌యూ నేతల అరెస్ట్‌
మనోధైర్యం ముఖ్యం
వ్యాగన్ల తయారీ కేంద్రానికి ఎంత భూమి కావాలి? ఎన్ని నిధులిస్తారు?
పేదరికమే గిటురాయిగా కేసీఆర్‌ పథకాలు
ఎల్‌ఐసీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు విరమించుకోండి
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఎత్తేయాలి
6న హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర
ఎమ్మెల్సీ నివాసంలో ఐదో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు
జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉత్తర్వులు నిలుపుదల

తాజా వార్తలు

09:56 PM

రేపు తెలంగాణ బడ్జెట్‌

09:35 PM

నా ప్రతి అడుగులో ఎన్టీఆర్ వెన్నంటే ఉంటాడు: కల్యాణ్ రామ్

09:01 PM

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

08:58 PM

కోల్‌కతాలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ...

08:47 PM

నటుడు రవి కిషన్‌ ఇంట్లో విషాదం...

08:36 PM

బీఆర్ఎస్ నుంచి 20 మంది నాయకులపై బహిష్కరణ వేటు

08:11 PM

ఏపీ ఎస్సై రాత పరీక్ష హాల్‌టిక్కెట్లు విడుదల..

07:52 PM

కొత్త సచివాలయ ప్రారంభోత్సవంపై హైకోర్టుకు కేఏ పాల్

07:33 PM

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన పాక్ క్రికెట‌ర్

07:18 PM

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్

06:34 PM

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

06:31 PM

పమ్రుఖ కమెడియన్ గజేంద్రన్ కన్నుమూత..

06:31 PM

మ్యాచ్ జరుగుతుండగా సమీపంలో ఉగ్రదాడి...

06:20 PM

విశ్వనాథ్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చంద్రబాబు

06:01 PM

ముగిసిన గాయని వాణీ జయరాం అంత్యక్రియలు

05:59 PM

కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్‌ ముఠా అరెస్టు

05:56 PM

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి

05:32 PM

సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభం

05:25 PM

నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

05:08 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

05:06 PM

కేంద్రం మరో సంచలనం..232 యాప్స్‌ నిషేధం

05:25 PM

దేశంలో మార్పులు అవసరం: సీఎం కేసీఆర్

04:17 PM

మా దృష్టంతా ఆ మ్యాచ్ పైనే : హ‌ర్మ‌న్‌ప్రీత్

04:07 PM

టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ

03:47 PM

కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...

03:40 PM

వివేకా హత్య కేసులో నిజాలు త్వరలోనే తెలుస్తాయి: దస్తగిరి

03:30 PM

బీఆర్ఎస్‌లో చేరిన నాందేడ్ నాయ‌కులు

03:22 PM

బెంగాల్‌లో బాంబు దాడి, టీఎంసీ కార్యకర్త మృతి

03:09 PM

క్వెట్టాలో భారీ పేలుడు... అనేక మందికి గాయాలు

03:01 PM

నాటు బాంబు పేలి రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.