Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కలిసి పనిచేస్తేనే ఐక్యత | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

కలిసి పనిచేస్తేనే ఐక్యత

- దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
- తెలంగాణాలో రైతు సంఘాన్ని బలోపేతం చేయాలి : ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా
నవతెలంగాణ - నల్లగొండ
           ''నినాదాలతో ఐక్యత రాదని కలిసి పనిచేసి పోరాడితే ఐక్యత వస్తుంది.. రాష్ట్రంలో రైతు సంఘాన్ని మరింత బలోపేతం చేయాలి. ప్రతి గ్రామంలో సంఘం ఏర్పాటు చేసి.. ప్రతి రైతునూ సభ్యునిగా చేర్చుకోవాలి.. సభ్యత్వం నమోదులో కేరళ రాష్ట్రం అత్యధికంగా చేసింది.. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'' అని ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా పిలుపునిచ్చార. నల్లగొండలో జరిగిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ ముగింపు సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. సంఘం విశిష్టతను తెలియజేసి.. దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు.
రైతులు ఏకమైతే మోడీ ప్రభుత్వం పతనం.. : ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు నంద్యాల
           దేశంలో రైతులు, రైతు సంఘాలు ఏకమైతే మోడీ ప్రభుత్వం పతనం ఖాయమని ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. మోడీ సర్కార్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా అమ్ముతూ.. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తోందని చెప్పారు.
గిరిజన రైతుల్లో 80శాతం సన్న, చిన్నకారులే.. గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్‌నాయక్‌
           గిరిజన రైతుల్లో నూటికి 80శాతం సన్న, చిన్నకారు రైతులుగానే మిగిలిపోతున్నారని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్‌ నాయక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తండాల్లో జీవనాధారం లేక గిరిజన రైతులు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిం దన్నారు. కౌలు రైతులు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూముల రైతులకు హక్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
స్వామినాథన్‌ సిఫార్సుల అమలుకు సంఘటిత పోరు: ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
           స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు కోసం రైతాంగం సంఘటిత పోరాటం చేయాలని ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయం రైతులకు ఉపయోగకరంగా మారాలంటే ప్రభుత్వ విధానాలు మారాలన్నారు. ప్రతి గ్రామంలో రైతులతో కమిటీలు ఏర్పాటుచేసి సమస్యల పరి ష్కారానికి పోరాటానికి సన్నద్ధం కావాలన్నారు. విద్యుత్‌ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వ పతనం ఖాయమని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం కేంద్రం అనేక చట్టాలను తెచ్చిందని, వాటిని అడ్డుకునేందుకు పోరాడాలని అన్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి వెబ్‌సైట్‌ కారణంగా రైతులకు నేటికీ పాస్‌పుస్తకాలందక రైతుబంధు, రైతుబీమా పథకాలకు నోచుకోవడం లేదని వివరించారు.
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు
నవతెలంగాణ -నల్లగొండ
           దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించి, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఏఐకేఎస్‌ సహాయ కార్యదర్శి డాక్టర్‌ విజ్జు కష్ణన్‌ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏచూరిగార్డెన్‌లో (మల్లుస్వరాజ్యం నగర్‌) మాలి పురుషోత్తంరెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో మూడ్రోజులు నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిలభారత రైతు సంఘాన్ని రానున్న కాలంలో నిర్మాణాత్మకంగా మరింత పటిష్ట పరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేరళ రాష్ట్రం తిరుసూర్‌లో అఖిలభారత మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలంలో అవలంబించిన రైతాంగ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర మహాసభలో చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ సర్కార్‌ను గద్దె దించేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రైతాంగం సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు సంఘాల 13 నెలల పోరాటంలో 750 మంది రైతులు ప్రాణ త్యాగం చేశారని, ఈ పోరాటం భవిష్యత్‌ రైతాంగ పోరాటాలకు ఆశాకిరణమని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మల్లారెడ్డి సారూ.. మోటారు సైకిళ్లు ఇప్పించండి
మే 7 నుంచి ఎంసెట్‌
అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే..
ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసులపై దాడులు ఆపాలి
317 జీవో టీచర్లకే బదిలీ అవకాశం
సీఎం చిత్రపటానికి సెర్ప్‌ ఉద్యోగుల క్షీరాభిషేకం
ఒక శాతం చందాతో నగదు రహిత ఆరోగ్య పథకం
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు
హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌
పోడు రైతులకు అన్యాయం
మాన్సే డైనాస్టార్‌ -2023 పోటీ ప్రారంభం
15 రోజుల్లో 11వేల స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లు
ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలి
గిరిజనులకు కేంద్రం కన్నా ఎక్కువ నిధులు
ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీం ముందుకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌్‌
గ్లోబరీనాకు టెండర్‌లో పాల్గొనే అర్హత లేదు
కంట్లో కారం నోట్లో బెల్లంలా బడ్జెట్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఉచిత మెంటర్‌షిప్‌
రెండో రోజూ ప్రొఫెసర్‌ కాశీం దీక్ష
సీబీఐ దర్యాప్తును నిలిపేయండి
పాతబస్తీని మరింత అభివృద్ధి చేస్తాం
అద్భుతమైన రచన 'ఊరు గాని ఊరు'
బడ్జెట్‌లో మాకు అన్యాయం..
పట్టణ ప్రాంతాల్లో 'ఉపాధి' విస్తరణ ప్రస్తావనేదీ?
మహారాష్ట్రకు నీరివ్వడమంటే... రాష్ట్రానికి అన్యాయం చేయడమే
బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్‌ దుర్భాషలు
టోఫెల్‌ పరీక్షలో మంచి స్కోర్‌ ఇప్పిస్తామంటూ మోసం
ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

తాజా వార్తలు

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.