Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రతి చెరువుకు నీళ్లు చేరవేయడమే లక్ష్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

ప్రతి చెరువుకు నీళ్లు చేరవేయడమే లక్ష్యం

- కాల్వల పనులు త్వరగా పూర్తి చేయాలి
- ఇరిగేషన్‌ పనుల పురోగతిపై : మంత్రి హరీశ్‌రావు సమీక్ష
నవతెలంగాణ-సిద్దిపేట
         ప్రతి ఊరికి, ప్రతి చెరువుకూ కాల్వలు, మైనర్‌ కాల్వల ద్వారా నీళ్లు చేరవేయడమే లక్ష్యంగా పని చేద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. మైనర్‌ ఇరిగేషన్‌ కాల్వ భూసేకరణ తొందరగా చేపట్టి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మల్లన్న, రంగనాయక సాగర్‌ జలాశయం ద్వారా కాల్వలు, మైనర్‌ కాల్వల పనుల పురోభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ, ఇరిగేషన్‌ ఈఈ, డీఈ, ఇంజినీరింగ్‌ అధి కారులతో మంత్రి సమీక్షిం చారు. మైనర్‌ ఇరిగేషన్‌ పనులకు కావాల్సిన వాటిలో చిన్నకోడూర్‌ మండలంలో కస్తూ రిపల్లి చెక్‌ డ్యాం, మల్లారం చెక్‌ డ్యాం, నారాయణ రావుపేట మండల కేంద్రమైన పెద్ద చెరువు కాజ్‌ వే, గోపులాపూర్‌ చెక్‌ డ్యాం, ఇబ్రహీంనగర్‌ గ్రామ మిట్ట మల్లయ్య చెరువు రిస్టోరేషన్‌ పనులు, గుర్రాలగొంది చెరువు, రాజగోపాల్‌ పేట, నంగునూరు చెరువులకు కాజ్‌వే నిర్మాణ పనులకు వెంటనే అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్‌ ఈఈ సాయిబాబాను ఆదేశించారు. మల్లన్నసాగర్‌ 1ఆర్‌ కాలువ ఆయకట్టు 21000 ఎకరాల పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. మల్లన్నసాగర్‌ 1ఆర్‌ పరిధి గ్రామాల మీదుగా వెళ్లే కాల్వ భూసేకరణ, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మల్లన్న సాగర్‌ 3ఆర్‌, 4ఆర్‌ కాల్వపై చర్చించారు. పుల్లూర్‌ గ్రామ పడమట చెరువు, వెంకటయ్య చెరువు, నాగుల కుంటకు నీళ్లు నింపితే ఆ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. రంగనాయకసాగర్‌ ఎల్‌ఎంసి-ఆర్‌ 8 కాలువ వాగు క్రాసింగ్‌ బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని, ఏజన్సీ, ఇరిగేషన్‌ అధికారిని ఆదేశించారు. ఆర్‌ 8 కాలువ ద్వారా మాటిండ్ల గ్రామం వరకు నీళ్లు ఇవ్వాలని సూచించారు. రంగనాయకసాగర్‌ ఎల్‌ఎంసి-ఆర్‌ 3- ఆర్‌ ఎం 2-ఎల్‌ఎస్‌ఎం5 కాలువ పనులు, భూసేకరణ త్వరగా పూర్తి చేసి మైలారం, కమ్మర్లపల్లి, చౌడారం, అల్లీపూర్‌కు వెంటనే నీళ్లు ఇవ్వాలని, అలాగే నంగునూర్‌ మండలం ఘనపూర్‌, అక్కేనపల్లి, గట్లమల్యాల గ్రామాలకు వాగు మీద జరుగుతున్న లిఫ్ట్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు ఇవ్వాల,ని అధికారులకు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ అడ్డంకులను అధిగ మించాలని దిశానిర్దేశం చేశారు. నాగరాజుపల్లి ద్వారా వాగులోకి ఎల్‌ డి10 కాలువ ద్వారా వాగులోకి నీళ్లు ఇవ్వాలని, నంగునూర్‌ మండలంలో కాలువ ఎల్‌ డి6-ఎల్‌ ఎం 1 పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
మత్స్య సహకారం సంఘాలు ఏర్పాటు చేయాలి
         నీటి వనరులపై నూతన సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన దరిమిలా మత్స్యకారులకు కొత్త సొసైటీల ఏర్పాటు కసరత్తు త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా మత్స్యకార శాఖ అధికారిని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కొత్త సభ్యులకు ప్రభుత్వ పథకాలతో పాటు సబ్సిడీ రుణాలు, బీమా సౌకర్యం లభిస్తాయన్నారు. సంఘాల్లో చేరే వారికి నైపుణ్య పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారికే మెంబర్‌షిప్‌ ఇస్తారన్నారు. సమీక్ష సమావేశంలో సుడా చైర్మెన్‌ రవీందర్‌ రెడ్డి, చిన్నకోడూర్‌ ఏంపీపీ కూర మాణిక్‌ రెడ్డి, నాయకులు చందర్‌రావు, ఆర్డీఓ ఆనంతరెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ సాయి బాబా, డీఈ, ఏఈఈ ఖాజా, ఏఈఈ అమరజీవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాష్ట్రాభివృద్ధి దేశానికి ఆదర్శం
6న రాష్ట్ర బడ్జెట్‌
గవర్నర్‌ ప్రసంగం ప్రశాంతం
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం
పత్తి రైతుకు ప్రయివేటే దిక్కా..?
పాలసీదారుల సొమ్ము భద్రం
ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు
సినీ పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోతారు
పేదలను విస్మరించిన కేంద్రం
బీజేపీలోకి వద్దన్నా...
కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
బిల్లులు రాక.. ఆర్థిక ఇబ్బందులతో..
న్యాయమూర్తికే నోటీసుపై హైకోర్టు ఆగ్రహం
ప్రయివేటు టీచర్ల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
జీతాలు రాలే!
కరెంట్‌.. ఐదారుగంటలే
ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా మిట్టల్‌ను కొనసాగించాలి
రైల్వే బడ్జెట్‌లో.. తెలుగు రాష్ట్రాలకు రూ.12,800 కోట్లు
మహావీర్‌ పరిశ్రమను మూసేయాలని ధర్నా
ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ కబ్జా చేయించిండు...
గవర్నర్‌ ప్రసంగాన్ని ఆహ్వానిస్తున్నాం
కంటివెలుగు డాక్టర్లు, సిబ్బందికి డీజీపీ అభినందనలు
ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ
దేశవ్యాప్తంగా హగ్‌ హెర్‌ మోర్‌ ప్రచార కార్యక్రమం
ఎందుకు రావట్లేదు.. : కేటీఆర్‌
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ధర్నా : ఐద్వా
ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
నాందేడ్‌లో సభకు భారీ ఏర్పాట్లు
అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనివ్వరా..
అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

తాజా వార్తలు

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.