Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పట్టణీకరణలో తెలంగాణ ముందువరుసలో | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

పట్టణీకరణలో తెలంగాణ ముందువరుసలో

- పట్టణ ప్రగతి కింద ప్రతి నెలా నిధుల విడుదల
- ఇప్పటిదాకా రూ. 3,786 కోట్ల 78 లక్షల నిధుల మంజూరు
- జీహెచ్‌ఎంసీకే రూ.1.919. 49 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
              దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిని అమలు చేస్తున్నది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 142 మున్సిపాల్టీలు, నగరాలకు రూ.3,786. 78 కోట్ల నిధులను మంజూరు చేసింది. మొత్తం నిధుల్లో రూ.3,066.21 కోట్లు వినియోగించబడ్డాయి. ఒక్క జీహెచ్‌ఎంసీకే రూ.1.919.49 కోట్లను విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ శాఖ ప్రతి నెలా ఒక క్రమ పద్ధతిలో నిధులు విడుదల చేస్తూ ప్రణాళికాయుతంగా అభివృద్ధికి బాటలు వేస్తున్నది. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలకు సంబంధించి పట్టణ ప్రగతి కింద జీహెచ్‌ఎంసీకి రూ.91.65 కోట్లు, మిగిలిన కార్పొరేషన్లకు రూ.78.48 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పట్టణ ప్రగతి ద్వారా అంత్యంత నివాసయోగ్య నగరాలు, పట్టణాలున్న రాష్ట్రంగా తెలంగాణకు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తున్నది. జీహెచ్‌ఎంసీ మినహా 141 యూఎల్‌బీలలోని 2,548 వాహనాల ద్వారా రోజుకు 2,675 మెట్రిక్‌ టన్నుల చెత్తను తరలించేవారు. పట్టణ ప్రగతితో అదనంగా 2,165 శానిటేషన్‌ వాహనాలను కొనుగోలు చేశారు. శానిటేషన్‌ వాహనాల సంఖ్య రూ.4,713 కి పెరగటం వల్ల రోజుకు తరలిస్తున్న చెత్త పరిమాణం 4,356 టన్నులకు చేరింది. దీనితో పట్టణ, నగర ప్రాంతాల్లో శానిటేషన్‌ పరిస్థితి మెరుగైంది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. అందులో భాగంగా 141 పురపాలక సంస్థలు మొత్తం 965 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న స్థలాల్లో డంప్‌ యార్డులను నిర్వహిస్తున్నది. 205 చోట్ల పొడి, తడి చెత్త సేకరణ కేంద్రాలను, 224 కాంపోస్ట్‌ షెడ్స్‌, బెడ్‌లను ఏర్పాటు చేశారు.
పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాలను కలుషితం కాకుండా కాపాడుకునేందుకు 71 నగర, పురపాలక సంస్థలో రూ.250 కోట్ల 73 లక్షలతో హమ్‌ మోడల్‌లో నెలకొల్పిన మానవ మల వ్యర్ధాల శుద్ధి ప్లాంట్ల నిర్వహణను పటిష్టం చేశారు. అలాగే రూ.177 కోట్ల 33 లక్షలతో కొత్తగా 68 పుర,నగర పాలక సంస్థల్లో ఈపీసీ మోడల్‌లో ఎఫ్‌ఎస్‌టీపీలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 139 ఎఫ్‌ఎస్‌టీపీల ద్వారా రోజుకు 2,060 కిలోలీటర్ల మానవ మల వ్యర్ధాల శుద్ధికరణ చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. కొత్తగా 20 నగర, పుర పాలక సంస్థల్లో మంజూరు చేసిన ఎఫ్‌ఎస్‌టీపీల పనులు పూర్తయ్యాయి. 24 చోట్ల చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి.
మరో 36 చోట్ల చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 46 యూఎల్‌బీలలో ఎఫ్‌ఎస్‌టీపీల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించడం జరిగింది. మరో 22 యూఎల్‌బీలలో స్థల అన్వేషణ జరుగుతున్నది. గతంలో జీహెచ్‌ఎంసీ మినహా 141 యూఎల్‌బీలలో 4,970 పబ్లిక టాయిలెట్లు మాత్రమే ఉన్నవి. ప్రతి వేయి మందికి ప్రతి వేయి మందికి ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం అమలుచేస్తున్నది. దానిలో భాగంగా పురుషులకు 2,060, మహిళలకు 2,058, మొత్తం 4,118 పబ్లిక్‌ టాయిలెట్స్‌ ను నిర్మించారు. వీటితో కలిపి పబ్లిక్‌ టాయిలెట్స్‌ సంఖ్య 9,088 కి చేరాయి. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ కోసం 18 పారామీటర్లతో యాప్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ చెకింగ్‌ను అమలు చేస్తున్నది. ఈ పారామీటర్ల ప్రకారం ప్రతి మంగళవారం, శుక్రవారాలలో పబ్లిక్‌ టాయిలెట్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పట్టణ ప్రగతిలో నగర, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుకు చేపట్టిన పనులతో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాష్ట్రాభివృద్ధి దేశానికి ఆదర్శం
6న రాష్ట్ర బడ్జెట్‌
గవర్నర్‌ ప్రసంగం ప్రశాంతం
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం
పత్తి రైతుకు ప్రయివేటే దిక్కా..?
పాలసీదారుల సొమ్ము భద్రం
ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు
సినీ పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోతారు
పేదలను విస్మరించిన కేంద్రం
బీజేపీలోకి వద్దన్నా...
కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
బిల్లులు రాక.. ఆర్థిక ఇబ్బందులతో..
న్యాయమూర్తికే నోటీసుపై హైకోర్టు ఆగ్రహం
ప్రయివేటు టీచర్ల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
జీతాలు రాలే!
కరెంట్‌.. ఐదారుగంటలే
ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా మిట్టల్‌ను కొనసాగించాలి
రైల్వే బడ్జెట్‌లో.. తెలుగు రాష్ట్రాలకు రూ.12,800 కోట్లు
మహావీర్‌ పరిశ్రమను మూసేయాలని ధర్నా
ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ కబ్జా చేయించిండు...
గవర్నర్‌ ప్రసంగాన్ని ఆహ్వానిస్తున్నాం
కంటివెలుగు డాక్టర్లు, సిబ్బందికి డీజీపీ అభినందనలు
ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ
దేశవ్యాప్తంగా హగ్‌ హెర్‌ మోర్‌ ప్రచార కార్యక్రమం
ఎందుకు రావట్లేదు.. : కేటీఆర్‌
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ధర్నా : ఐద్వా
ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
నాందేడ్‌లో సభకు భారీ ఏర్పాట్లు
అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనివ్వరా..
అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

తాజా వార్తలు

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.