Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వాన్ని నడుపుతున్న కార్పొరేట్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

ప్రభుత్వాన్ని నడుపుతున్న కార్పొరేట్లు

- వారి అభివృద్ధే దేశాభివృద్ధిగా ప్రచారం
- మీడియా కూడా వారి గుత్తాధిపత్యంలోనే...
- కామ్రేడ్‌ ఆశిష్‌సేన్‌ జన్మదిన శతవార్షికోత్సవ సభలో ప్రొఫెసర్‌ జీ హరగోపాల్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
             ''కార్పొరేట్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రమాదం సంభవిస్తుందని గ్రహించగానే మతోన్మాదాన్ని రెచ్చగొ డుతున్నారు. ప్రశ్నించకుండా భయాన్ని సృష్టిస్తున్నారు. మానవత్వాన్ని మరిచి మనిషి స్వార్థపరుడిగానే బ్రతకాలంటూ జీవితాలను సూత్రీకరిస్తున్నారు. దీనికి అనుగుణంగా మీడియా కూడా వారి గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయింది. కార్పొరేట్ల అభివృద్ధే దేశాభివృద్ధి అని ప్రచారం చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టడంలో, ప్రజల్ని వాస్తవాలవైపు మళ్ళించడంలో ఇతర రాజకీయపార్టీలు, బాధ్యత కలిగిన ప్రభుత్వరంగ ఉద్యోగులు విఫలం చెందుతున్నారు. అందువల్లే దేశంలో ప్రయివేటీకరణ ఎలాంటి ప్రతిఘటన లేకుండా సాఫీగా సాగిపోతున్నది'' అని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జీ హరగోపాల్‌ విశ్లేషించారు. కామ్రేడ్‌ ఆశిష్‌సేన్‌ జన్మదిన శతవార్షికోత్సవాల సందర్భంగా ఏపీ-టీఎస్‌ రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఆఫ్‌ ఇండియా (టీఎస్‌), ఆర్బీఐ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (హైదరాబాద్‌), నాబార్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (హైదరాబాద్‌) సంయుక్తాధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ''జాతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన-రుణపరపతి విధానం -ప్రయివేటీకరణ'' అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో అమానవీయత రాజ్యమేలుతున్నదనీ, నియో లిబరల్‌ విధానాలతో మానవ సంబంధాలు ధ్వంసం అవుతున్నాయనీ, ఇది భవిష్యత్‌ తరాలకు అత్యంత ప్రమాదకరమని అన్నారు. గ్రామీణ బ్యాంకుల ప్రయివేటీకరణతో వచ్చే ప్రమాదాలను 33 కోట్ల మంది ఖాతాదారులకు అర్థమయ్యేలా చెప్పాలనీ, వారి మద్దతు ఉంటేనే ప్రజాక్షేత్రంలో విజయం సాధించ గలుగుతారంటూ ఢిల్లీ రైతాంగ పోరాటాన్ని ఉదహ రించారు. కేంద్రంలోని ప్రభుత్వ విధానాలవల్ల జరిగే నష్టాలను ఏరంగంలో ఉండే ఉద్యోగులు వారి వారి స్థాయిల్లో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. కాంగ్రెస్‌ సరళీకృత ఆర్థిక విధానాలను తెచ్చి, అమలు చేసిందనీ, ఆపార్టీ కంటే అత్యంత వేగంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అవే విధానాలను అమలు చేస్తుండటంతో కార్పొరేట్లు మోడీ పక్షాన నిలుస్తున్నారని వివరించారు. ఈ విధానాల అమలుకు మత విశ్వాసాలను వాడుకుంటూ, వాటిని విద్వేషంగా మార్చే శక్తి ఉందని కార్పొరేట్లు గ్రహించారని చెప్పారు. సంస్కృతిని వినిమయ వస్తువుగా మార్చవచ్చని రుజువైందనీ, దీన్ని సమాజంలో గందరగోళపర్చడం ద్వారా మనుగడ సాగించొచ్చని కార్పొరేట్లు భావిస్తున్నారని తెలిపారు. అయితే ఇవి సుదీర్ఘకాలం నిలవబోవనీ, హిట్లర్‌ కూడా ఇలాంటి విధానాలే అమలు చేసి, విజయం సాధించాలని ప్రయత్నించారని ఉదహరించారు. సోషలిస్టు వ్యతిరేక భావజాలాన్ని అమెరికా అక్కడి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగిందనీ, ఇప్పుడు భారతదేశంలోనూ ఇదే ఒరవడి కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రయివేటీకరణ కొత్త పుంతలు తొక్కుతూ అదానీ, అంబానీకరణవైపు సాగుతున్నదని విమర్శించారు. యావత్‌ దేశ సంపద వారి చేతుల్లోకి వెళ్ళిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం ద్వారానే ప్రభుత్వ రంగ పరిరక్షణ సాధ్యమవుతుందనీ, ఉద్యోగులే ఆ బాధ్యతల్ని స్వీకరించాలని చెప్పారు. విచిత్రంగా ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్యే విభేదాలు తలెత్తేలా ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానే విధాన రూపకల్పన చేస్తున్నాయని ఉదహరించారు. వాటిని అధిగమిస్తూనే ప్రజా మద్దతుతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. బెఫీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రామయ్య మాట్లాడుతూ బ్యాంకింగ్‌ రంగంలో సమాన పనికి సమాన వేతనం ధ్వంసం అవుతున్నదని అన్నారు. ఎస్‌బీఐ వంటి సంస్థ తానే స్వయంగా ఔట్‌సోర్సింగ్‌ ఏజేన్సీ ఏర్పాటు చేసుకొని రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటున్నదని చెప్పారు. గ్రామీణ బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రమాదాలు, నష్టాల పట్ల ఉద్యోగులకే సరైన అవగాహన, అధ్యయనం ఉండట్లేదని అభిప్రాయపడ్డారు. ప్రజలను సమీకరించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమానికి ఆర్‌ఆర్‌బీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. నాబార్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జీ మోహన్‌కుమార్‌, ఆర్బీఐ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అర్గనైజింగ్‌ సెక్రటరీ తిలక్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష

తాజా వార్తలు

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

03:25 PM

ముడి చమురు ధర తగ్గినా పెట్రో ధరల పెంపు ఎవరి కోసం మోడీజీ : కేటీఆర్

03:10 PM

ఓట్లు వేయించుకోవడానికి రైతులు కావాలి కానీ.. రైతుల గోస పట్టదా?

02:37 PM

రెండున్నర గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

02:30 PM

తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.