Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ఏది..!? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ఏది..!?

- రెండేండ్లుగా జరపని కేంద్రం
- కొనసాగుతున్న జలవివాదాలు
- తలలు పట్టుకుంటున్న అధికారులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
            తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏండ్ల తరబడి కొనసాగుతున్నాయి. పరిష్కారాలు ఎండ మావిగానే మిగులుతున్నాయి. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్న మోడీ సర్కారు, ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి పంచాయతీల పరిష్కారానికి చిత్తశుద్ధిని ప్రద ర్శించడం లేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులతో కూడిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించడం లేదు. దీంతో సాగునీటి వివాదాల పరిష్కారం ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది.
ఈ సమావేశాలు తరచుగా జరిపితే, సాగునీటి సమస్యలు సైతం అంతే వేగంగా కొలిక్కిరావడానికి అవకాశముంటుంది. కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. గత రెండేండ్లుగా ఈ సమావశాల జోలికి కేంద్రం పోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ ఆ సంగతి తేల్చలేదు. నాన్చుతూనే ఉంది. కృష్ణా జలాల పున:పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారంపై అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టిసారిస్తుందని అనుకున్నారు కూడా. ఆ కౌన్సిల్‌ భేటిలో ప్రత్యేకించి కృష్ణానది జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోసారి చర్చ జరగాల్సి ఉండగా, అది పెండింగ్‌లో పడింది. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంలో రెండు రాష్ట్రాల మధ్య అనేక అభ్యంతరాలు, అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అపెక్స్‌ కౌన్సిల్‌ 2017లో ఒకసారి జరపగా, 2020, అక్టోబరులో మరోసారి భేటి జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటిలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. గత రెండేండ్లుగా అపెక్స్‌ కౌన్సిల్‌ భేటి ఒక్కసారీ కూడా జరగకపోవడం గమనార్హం. ఇప్పటికే గోదావరి నదీపైన ఎలాంటి అంతరాష్ట్ర ప్రాజెక్టులు లేని కారణంగా జీఆర్‌ఎంబీ బోర్డు అవసరం లేదని తెలంగాణ చెబుతుండగా, నిర్మాణం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమమని ఏపీ సర్కారు అంటున్నది.
కృష్ణానదీ పరిధిలోని పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా బేసిన్‌ అవతలకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది. పదే పదే అటు కేంద్రానికి, ఇటు కేఆర్‌ఎంబీకి లేఖలు రాస్తున్నది. కేంద్రం నిర్లక్ష్యం ఫలితంగా తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పున:పంపిణీ చేయాలనే డిమాండ్‌ దీర్ఘకాలికంగా పెండింగ్‌లోనే ఉంది. అది ఇటీవల మరింత తీవ్రమైంది. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యూనల్‌ (కేడబ్ల్యూడీటీ-2) ప్రకారం నదీ జలాల పున:పంపిణీ జరిగి తీరాల్సిందేనని రాష్ట్రం పట్టుపడుతున్నది. కృష్ణానదిలో నీటి లభ్యత ఆధారంగా 75 శాతం ప్రాతిపదికన తెలంగాణకు 574 టీఎంసీలు ఇవాల్సి ఉందని ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు లేఖలు రాసింది. ఈ మేరకు నీటి కేటాయింపులు పున:పంపిణీ చేయాలని కోరినా కేఆర్‌ఎంబీ స్పందించడం లేదనీ, గతంలో మాదిరిగానే 299 టీఎంసీలనే కేటాయిస్తున్నదని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో అంతరాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్‌ 3 ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి, ప్రధానంగా కృష్ణా నదీ నీటి పంపిణీకి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. కృష్ణా జలాల వివాదాల అంశాలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని అపెక్స్‌ కౌన్సిల్‌ ఎదుట తొలి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాదన వినిపిస్తూనే ఉందని నీటిపారుదల శాఖ ఉన్నతా ధికారులు చెబుతున్నారు. కేంద్రం అస్పష్టమైన వైఖరి నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వివాదాలు ఇలా కొన సాగుతుండగానే కేఆర్‌ఎంబీ సభ్యులు, రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) చైర్మెన్‌ రవి పిళ్లై బదిలీకావడం కొసమెరుపు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణకు అన్యాయం
పేదలకు గుంట భూమి ఇవ్వరా..
రాష్ట్రాలను నిరుత్సాహపరిచింది..
సీఎం సాబ్‌... ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి...
'పశు మిత్రుల'ను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి
పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు పట్టాలివ్వాలి
లోపాలు సరిదిద్దుకుంటేనే మనుగడ
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల పోరాటం
వేతన జీవులకు మొండి చేయి : టీఎస్‌యూటీఎఫ్‌
పాలమూరుకు జాతీయహోదా మరిచిపోవాల్సిందే !
9న మహాధర్నాను విజయవంతం చేయండి
'కాసాని' తల్లి అంత్యక్రియలు పూర్తి
విద్యా వైద్యాన్ని వదిలేసిన పద్దు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశాల ఐక్య వేదిక
పీఆర్సీపై యాజమాన్యంతో టీఈఈజేఏసీ చర్చలు
'యోగాసన' విజేతలకు బహుమతులు ప్రదానం
సీఎం కేసీఆర్‌ను కలిసిన అమిత్‌జోగి
గండ్ర దంపతులకు 'డబుల్‌ ఇండ్ల'పై నిరసన సెగ
మొదలైన మేడారం మినీ జాతర
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్‌మిట్టల్‌ బాధ్యతల స్వీకరణ
బొగ్గు రవాణాలో సింగరేణి రికార్డు
బడ్జెట్‌పై కార్పొరేట్ల స్పందన
కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల పెదవి విరుపు
తెలంగాణ ఊసే లేదు :వైఎస్‌ షర్మిల
కార్పొరేట్‌ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్‌
కేంద్ర బడ్జెట్టా..? కొన్ని రాష్ట్రాల పద్దా...?
ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకుంటే రాయితీలు
'ఆపరేషన్‌ స్మైల్‌'తో 2814 మంది పిల్లలకు విముక్తి
ఉపాధ్యాయ బదిలీలకు 59,741 దరఖాస్తులు

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.