Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏం ఒరగబెట్టారు... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

ఏం ఒరగబెట్టారు...

- దేశాన్ని అప్పులపాలు చేసింది మోడీ ప్రభుత్వమే..
- ఏం చేశారని పాలమూరు నుంచి పోటీ చేస్తారు?
- పాలమూరు -రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించారా? : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి పాలమూరు జిల్లాకు మీరు ఏం ఒరగబెట్టారు.. కృష్ణా జలాల్లో ఈ జిల్లాకు దక్కాల్సిన నీటి వాటాలను తేల్చారా..? పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారా.. అసలు మీరు ఈ జిల్లాకు ఏమి చేశారని ఇక్కడి నుంచి ప్రధాని మోడీని పోటీ చేయించాలని చూస్తున్నారని ఐటీ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ బీజేపీని ప్రశ్నించారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన ప్రగతి నివేదన సభలో మంత్రి ప్రసంగించారు.
బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల కోసం పోట్లాడుతుంటే పరిస్థితులను చక్కదిద్దలేని ప్రధాన మంత్రి ఉక్రెయిన్‌-రష్యా యుద్దాన్ని నిలువరించేందుకు యత్నిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. గతంలో ఈ దేశాన్ని 14 మంది ప్రధాన మంత్రులు పరిపాలించిన కాలంలో రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే బీజేపీ ప్రభుత్వం రూ.100 కోట్ల లక్షల అప్పులు చేసిందని ఆరోపించారు.
బీజేపీ నేతలకు దమ్ముంటే.. పాలమూరు జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతోపాటు జాతీయ హోదా తీసుకురావడంపై తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించగలిగామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిమంతులకు పట్టం కట్టండని కోరారు. కేసీఆర్‌ నాయకత్వంలో తిరిగి హ్యాట్రిక్‌ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
రైతులపై ఆదాయపు పన్ను విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోడీ ఆర్థిక సలహాదారు విబేక్‌ దేబ్‌రారు ఒక జాతీయ పత్రికలో వ్యాసం రాశారన్నారు. ఈ దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిపోయిందని, వారిపై ఆదాయపు పన్ను వేయాలని ఆయన రాసుకొచ్చారన్నారు. ఆదాయమే లేదని ఏడుస్తుంటే.. రైతు మీద ఆదాయపు పన్ను వేయాలంటున్నరు.. దయచేసి రైతన్నలు ఆలోచించాలి అని కేటీఆర్‌ సూచించారు. ప్రధాని మోడీ కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, తాను చెప్పింది అబద్ధమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఒక వేళ వాస్తవమైతే బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకోవడంతోపాటు.. ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సాగు నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డి, డాక్టర్‌ లక్ష్మారెడ్డి, కృష్ణ మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ విఎం.అబ్రహం, జడ్పీ చైర్‌పర్సన్స్‌ కె.వనజ ఆంజనేయులు గౌడ్‌, సరిత, పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.అనసూయ, వైస్‌ చైర్మెన్‌ హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మల్లారెడ్డి సారూ.. మోటారు సైకిళ్లు ఇప్పించండి
మే 7 నుంచి ఎంసెట్‌
అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
సంక్షేమ రాజ్యం కావాలంటే.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలే..
ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసులపై దాడులు ఆపాలి
317 జీవో టీచర్లకే బదిలీ అవకాశం
సీఎం చిత్రపటానికి సెర్ప్‌ ఉద్యోగుల క్షీరాభిషేకం
ఒక శాతం చందాతో నగదు రహిత ఆరోగ్య పథకం
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు
హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌
పోడు రైతులకు అన్యాయం
మాన్సే డైనాస్టార్‌ -2023 పోటీ ప్రారంభం
15 రోజుల్లో 11వేల స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లు
ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలి
గిరిజనులకు కేంద్రం కన్నా ఎక్కువ నిధులు
ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీం ముందుకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌్‌
గ్లోబరీనాకు టెండర్‌లో పాల్గొనే అర్హత లేదు
కంట్లో కారం నోట్లో బెల్లంలా బడ్జెట్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ అభ్యర్థులకు ఉచిత మెంటర్‌షిప్‌
రెండో రోజూ ప్రొఫెసర్‌ కాశీం దీక్ష
సీబీఐ దర్యాప్తును నిలిపేయండి
పాతబస్తీని మరింత అభివృద్ధి చేస్తాం
అద్భుతమైన రచన 'ఊరు గాని ఊరు'
బడ్జెట్‌లో మాకు అన్యాయం..
పట్టణ ప్రాంతాల్లో 'ఉపాధి' విస్తరణ ప్రస్తావనేదీ?
మహారాష్ట్రకు నీరివ్వడమంటే... రాష్ట్రానికి అన్యాయం చేయడమే
బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్‌ దుర్భాషలు
టోఫెల్‌ పరీక్షలో మంచి స్కోర్‌ ఇప్పిస్తామంటూ మోసం
ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

తాజా వార్తలు

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

10:57 AM

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు..

12:16 PM

పంజాబ్‌ మెయిల్‌కు తప్పిన పెను ప్రమాదం..

12:16 PM

ఢిల్లీ మద్యం కేసులో..ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

09:45 AM

1300 ఉద్యోగులకు షాకిచ్చిన ‘జూమ్’..

09:12 AM

నేడ ఏపీ క్యాబినెట్ భేటీ…

09:02 AM

ఘనంగా బాలీవుడ్ ప్రేమజంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహం

12:16 PM

లోయలో పడ్డ బస్సు, కారు.. 30 మంది మృతి

07:39 AM

సిరియాకు చేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం..

07:22 AM

మృత్యుంజయులు ఈ చిన్నారులు..

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

12:17 PM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.