Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

ప్రభుత్వ కేజీ టు పీజీ దేశంలో ఎక్కడా లేదు

- రాష్ట్రంలో తొలి అడుగు గంభీరావుపేట విద్యాసంస్థలు
- మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కె.తారకరామారావు
- రాష్ట్ర వ్యాప్తంగా 'మన ఊరు-మనబడి' ప్రారంభం
నవతెలంగాణ - విలేకరులు
దేశంలోనే ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కేజీ టూ పీజీలాంటి విద్యా సంస్థలు లేవని, గంభీరావుపేట కేజీ టూ పీజీ విద్యాసంస్థలు తెలంగాణకు తొలి అడుగుగా ఉంటాయని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 'మన ఊరు- మన బడి' మొదటి దశ పాఠశాలలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్‌ను మంత్రులు సబిత, కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ క్యాంపస్‌కు ఆచార్య జయశంకర్‌ పేరుగా నామకరణం చేయాలన్నారు. అనంతరం క్యాంపస్‌లోని కిండర్‌ గార్డెన్‌ నుంచి పీజీ కళాశాల బ్లాక్‌లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, డిజిటల్‌ లైబ్రరీతోపాటు వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కేజీ టూ పీజీ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. ఆయన హామీ ప్రతి రూపమే కేజీ టూ పీజీ క్యాంపస్‌ అన్నారు. కేజీ టు పీజీ క్యాంపస్‌ నిర్మాణానికి తోడ్పాటు అందించిన రహెజా, దివిస్‌ ల్యాబరేటరీ, గివ్‌ తెలంగాణ, ఎంఆర్‌ఎఫ్‌ ప్రతినిధులను సన్మానించారు. క్యాంపస్‌లో విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనం చేశారు.
చింతకుంట మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. విద్యకు దూరం కావద్దని సీఎం కేసీఆర్‌ వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశారన్నారు. జిల్లాలో మొదటి విడత మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా 230 పాఠశాలలను రూ.92 కోట్లలతో ఆధునీకరణ చేయనున్నట్టు తెలిపారు. నిర్మిల్‌లో పాఠశాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.
మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో పలు చోట్ల అభివృద్ధి చేసిన పాఠశాలలను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. పద్మారావునగర్‌లోని మైలార్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మినగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని రాజ్‌భవన్‌ ప్రాథమిక పాఠశాలలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సాయన్న, దానం నాగేందర్‌, హైదరాబాద్‌ డీఈవో ఆర్‌.రోహిణీతో కలిసి మంత్రి ప్రారంభించారు.
నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పిస్తున్నామన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కమలానగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాల, నార్కట్‌పల్లి ప్రాథమిక పాఠశాలను పరిషత్‌ చైర్మెన్‌ బండా నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌తో కలిసి ప్రారంభించారు.
ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాథమిక పాఠశాలను రూ.12.49 లక్షలు, శాంతినగర్‌ ఉన్నత పాఠశాలను రూ.1.14 కోట్లతో మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయగా.. మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ ప్రారంభించారు.జనగామ జిల్లా దేవరుప్పల ప్రభుత్వ పాఠశాలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేపర్‌ లీకేజీలో కదులుతున్న డొంక
పారదర్శకంగా విచారణ జరపాలి
అగ్రవర్ణాల రాజ్యమే బీజేపీ లక్ష్యం
నేడు పలు జిల్లాల్లో సీఎం పర్యటన
వ్యతిరేకత ఉంది...రాజు జాగ్రత్త
హైవేలపై పచ్చదనం
కూల్‌ డ్రింక్స్‌ రూపంలో పెను ముప్పు
నత్తకు నడకనేర్పుతున్న భారత్‌మాల
ఎస్సారెస్పీ కెనాల్‌లో ఇద్దరు పిల్లల గల్లంతు
ప్రజావ్యతిరేక, మతోన్మాద శక్తులను తరిమికొట్టండి
25న ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల మహాధర్నా
ఆరోగ్య మహిళకు విశేష స్పందన 11 వేల మందికి స్క్రీనింగ్‌
సీతారాముల కళ్యాణ మహౌత్సవానికి సీఎంకు ఆహ్వానం
అక్కడిలాగే ఇక్కడా చేయలేమో...
మోడీ అంటే ఒక అమ్మకం
సీడీపీఓ, ఈఓ పరీక్ష రద్దు చేయాలి
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి : సర్దార్‌ వినోద్‌ కుమార్‌
ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి నిలయం...
తెలంగాణ జీవనగమనంలో మార్పు : హరీశ్‌రావు ట్వీట్‌
ఎంసెట్‌కు 1,34,443 దరఖాస్తులు
కర్మాగారంలో ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం

తాజా వార్తలు

10:59 AM

సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ ఉద్యోగులు బహిరంగ లేఖ

10:53 AM

కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు..

10:52 AM

సినీ ప్రముఖుల సమక్షంలోఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభం..

10:50 AM

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌..ఓటేసిన జగన్‌

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.