Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదలకు గుంట భూమి ఇవ్వరా.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

పేదలకు గుంట భూమి ఇవ్వరా..

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పి కొట్టాలి
- పట్టాలు అందే వరకు పోరాటం ఆగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్‌
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు నియంత పాలన కొనసాగిస్తున్నాయని బడా నేతలకు అప్పనంగా ఎకరాల కొద్దీ భూములు కట్టబెడుతూ.. పేదలకు మాత్రం గుంట భూమి ఇవ్వడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్‌ అన్నారు. ఇండ్ల స్థలాల పట్టాలు అందే వరకు పోరాటం ఆగదని, పేద ప్రజలకు ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు సర్వే నంబర్‌ 280, 283, 284, 285లోని సుమారు 24 ఎకరాల శిఖం భూమిలో ఆరు రోజుల కిందట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు. సుమారు 1500 గుడిసెలు వేశారు. బుధవారం అబ్బాస్‌ గుడిసెవాసులను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని.. దానిపై పూర్తి హక్కు పేదలకే ఉంటుందన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 32వేల ఎకరాల్లో ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయని వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల కోసం మూడున్నర లక్షల మంది నిరుపేదలు గుడిసెలు వేసుకున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తానన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్న ప్రభుత్వం.. పేదలపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. భూపోరాటంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి శిఖం భూములను పేదలకు పంచి పట్టాలు ఇవ్వడంతోపాటు ఇండ్లు కట్టించాలని డిమాండ్‌ చేశారు. భూమిని వదిలేది లేదని కరెంటు నీరు, రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాదులో జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 45 కోట్ల మంది దగ్గర ఉన్న సొత్తు ఎంతో.. కేవలం ఒక అదాని దగ్గర అంత ఉందని చెప్పారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 15 ఎకరాల్లో ఓ ధనవంతుడు ఇల్లు నిర్మించుకుంటే తప్పులేదు కానీ.. పేదలు గుడిసెలు వేసుకుంటే దౌర్జన్యం ఎందుకని ప్రశ్నించారు. పేదలకు ఉపయోగపడే నిత్యావసర సరుకులు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల భారత్‌ పేరుతో పేదలు గ్యాస్‌ పంపిణీ చేసినా.. ధర పెరగడం వల్ల మళ్లీ కట్టెల పొయ్యే దిక్కు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాంపెటి రాజన్న, చెన్నూరి రమేష్‌, పొలం రాజేందర్‌, దమేర కిరణ్‌, నాయకులు డబ్బా రాజన్న, అతుకురి శ్రీకాంత్‌, పొలం చిన్న రాజేందర్‌, సకినాల మల్లయ్య, గుర్రం దేవందర్‌, బొడ్డు కిషోర్‌, బొడ్డు స్మరన్‌, రిత్విక్‌, విజరు, మహేందర్‌, సంపత్‌, రాజు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మతోన్మాద బీజేపీకి గోరికడదాం
కూపీ లాగుతున్న సిట్‌
పీక్‌లో 20శాతం...ప్రజలపై భారం
మోడీ-షాల కుట్రలు సాగవు
సహజవనరులను అదానీకి కట్టబెడుతున్న బీజేపీ
నేడు 'వెన్నెల' ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం
మహిళా వికలాంగుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి
బీజేపీ నామరూపాల్లేకుండా పోవడం ఖాయం
ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్కులో పక్షుల వీక్షణ కార్యక్రమం
కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలోనే క్రమబద్ధీకరిస్తాం
కాంగ్రెస్‌లోకి డీఎస్‌
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
శ్రీచైతన్య ప్రైమరీ విద్యార్థుల అద్భుత ప్రదర్శన
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతివ్వాలి
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి
లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి
పేపర్‌ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి : వైఎస్‌ షర్మిల
ఉద్యోగులను బెదిరించడం తగదు
వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి
ఇక రైతు తుఫాన్‌ ఎవరూ ఆపలేరు
దొంగలను విమర్శిస్తే జైలుకా..?
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత

తాజా వార్తలు

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

09:14 AM

సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య మరో వందేభారత్‌ రైలు..

09:02 AM

రెండు క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..

08:55 AM

సజ్జలను విచారించాలి : నక్కా ఆనందబాబు

08:33 AM

నేడు సుప్రీం కోర్టులో వివేకా కేసు పిటిషన్‌పై విచారణ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.