Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2023

ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం

- అర్హులందరికీ డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
- 9న హైదరాబాద్‌ మహాధర్నాకు తరలిరావాలి : తెలంగాణ ప్రజాసంఘాల
ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య
- రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా
- తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేత
నవతెలంగాణ- మొఫసిల్‌ విలేకరులు
'అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్స్‌ ఇవ్వాలి. అవి దక్కే వరకు పోరాటాలు చేస్తాం. స్థలాలున్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలి. వీటిపైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇండ్ల పథకానికి అవసరమైన నిధుల్ని బడ్జెట్‌లో కేటాయించాలి..' అని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పేదలు పెద్దఎత్తున తరలివచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.వీరయ్య డిమాండ్‌ చేశారు. హిమాయత్‌నగర్‌, హయత్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్ష, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సాధన కోసం ఈ నెల 9వ తేదీన ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ప్రజల డిమాండ్‌ మేరకు ప్రజాపోరాటం చేయడంలో సీపీఐ(ఎం) ముందుంటుందన్నారు. ఇండ్లు లేని పేదలకు ఎర్రజెండా అండ, దండగా ఉంటుందన్నారు. ఇప్పటికే నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అర్హులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ నగరంలో పేదలకు లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌తో సీపీఐ(ఎం) కలిసి పనిచేసినా.. ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో వెనుకాడబోమని చెప్పారు.
కాప్రా మున్సిపల్‌ ఆఫీసు వద్ద ధర్నాలో పట్నం రాష్ట్ర నాయకులు డిజి.నర్సింహారావు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఉచితంగా కేటాయిస్తామని వాగ్దానం చేశారని, ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్కరికీ ఇల్లు కేటాయించలేదని అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌రాములు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పేదలు ఇండ్లు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన తెలిపారు.
            సంగారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు వందలాది మంది పేదలు దరఖాస్తులతో తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తోందన్నారు. ప్రతిపక్షం కూడా పేదల ఇంటి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇండ్లు లేని పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్స్‌ నిర్మించి ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొద్ది మందికే పరిమితం చేసిందన్నారు. పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కమిషనర్‌ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందజేశారు.
            గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవికి వినతిపత్రాన్ని అందజేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బిరెడ్డి సాంబశివ డిమాండ్‌ చేశారు. గుడిసవాసులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా బిరెడ్డి సాంబశివ మాట్లాడుతూ.. పస్రా పరిధి శివారు సర్వేనెంబర్‌-109లోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. గుడిసెవాసులకు రూ.5లక్షలతో పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పేపర్‌ లీకేజీలో కదులుతున్న డొంక
పారదర్శకంగా విచారణ జరపాలి
అగ్రవర్ణాల రాజ్యమే బీజేపీ లక్ష్యం
నేడు పలు జిల్లాల్లో సీఎం పర్యటన
వ్యతిరేకత ఉంది...రాజు జాగ్రత్త
హైవేలపై పచ్చదనం
కూల్‌ డ్రింక్స్‌ రూపంలో పెను ముప్పు
నత్తకు నడకనేర్పుతున్న భారత్‌మాల
ఎస్సారెస్పీ కెనాల్‌లో ఇద్దరు పిల్లల గల్లంతు
ప్రజావ్యతిరేక, మతోన్మాద శక్తులను తరిమికొట్టండి
25న ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల మహాధర్నా
ఆరోగ్య మహిళకు విశేష స్పందన 11 వేల మందికి స్క్రీనింగ్‌
సీతారాముల కళ్యాణ మహౌత్సవానికి సీఎంకు ఆహ్వానం
అక్కడిలాగే ఇక్కడా చేయలేమో...
మోడీ అంటే ఒక అమ్మకం
సీడీపీఓ, ఈఓ పరీక్ష రద్దు చేయాలి
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి : సర్దార్‌ వినోద్‌ కుమార్‌
ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి నిలయం...
తెలంగాణ జీవనగమనంలో మార్పు : హరీశ్‌రావు ట్వీట్‌
ఎంసెట్‌కు 1,34,443 దరఖాస్తులు
కర్మాగారంలో ఊపిరాడక ఇద్దరు కూలీల మృతి
పంట నష్టంపై కేంద్రం సహాయం సున్న
సీఐటీయూలో 2,400 మంది చేరిక..
వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి
లీకేజీకి పాలనా వైఫల్యమే కారణం
పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం
నిరసన ఉద్యోగుల ప్రజాస్వామిక హక్కు
కొల్లాపూర్‌ బెనిషాన్‌పై 'వైరస్‌'
సామాజిక చైతన్యానికి లఘు చిత్రాలు అవసరం

తాజా వార్తలు

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.