Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్రాభివృద్ధి దేశానికి ఆదర్శం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2023

రాష్ట్రాభివృద్ధి దేశానికి ఆదర్శం

- ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌
- ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ అన్నారు. శుక్రవారంనాడామె అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ఒకనాడు కరెంటు కోతలతో, వ్యవసాయం కుదేలై, తాగునీటి కోసం తల్లడిల్లిన తెలంగాణ ఇప్పుడు అన్నిరంగాల్లోనూ పురోభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పరిపాలనా దక్షత, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లే సాధ్యమైందని తెలిపారు. పెట్టుబడుల స్వర్గధామంగా, ఐటీ రంగంలో మేటిగా, పర్యావరణ పరిరక్షణలో ధీటుగా నిలుస్తున్నదని కొనియాడారు. ఎనిమిదిన్నరేండ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అనేక విజయాలను సాధించి, దేశం నివ్వెరపోయే అద్భుతాలను ఆవిష్కరించిందని అన్నారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు ఉంటే, స్వరాష్ట్రంలో ప్రభుత్వ కృషితో 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు.
తలసరి ఆదాయం పెరిగింది
తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేల నుంచి 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు పెరిగిందని వివరించారు. అన్ని రంగాల్లో రెట్టింపుస్థాయిలో అభివృద్ధి జరిగిందనీ, పెట్టుబడి వ్యయాన్ని అధికం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిని సాధించిందని ప్రసంసించారు. వ్యవసాయరంగ అభివృద్ధి, 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతుబీమా, మూడున్నరేండ్ల రికార్డు సమయంలో నిర్మించిన కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ నిర్మాణం అంశాలను ప్రస్తావించారు. 2014-15లో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల సాగునీటి సౌకర్యాలు ఉండగా, ఇప్పుడు 73 లక్షల 33 వేల ఎకరాలకు పెరిగాయని తెలిపారు. ఫలితంగా ధాన్యం దిగుబడి 68.17 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 2 కోట్ల 2 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగినట్టు వివరించారు. రాష్ట్ర జీడీపీలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నదని చెప్పారు.
అద్భుతమైన ప్రగతికి సూచికగా...
విద్యుత్‌రంగంలో వ్యవస్థాపక సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,453 మెగావాట్లకు పెరిగిందనీ, తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగి, అద్భుతమైన ప్రగతికి సూచికగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్టీల జనాభా దామాషా 10 శాతానికి పెరిగిందనీ, ఆదివాసీ, గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచామనీ తెలిపారు. అలాగే 2,471 గిరిజన తండాలు, గూడేలకు గ్రామ పంచాయతీ హౌదా కల్పించామనీ, ఫలితంగా 3,146 మంది గిరిజన బిడ్డలు సర్పంచులుగా స్థానిక పాలనలో భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం రూ.1లక్ష 116 ఆర్ధిక సహయాన్ని అందిస్తున్నామనీ, ఇప్పటి వరకు 12 లక్షల 469 మంది ఆడపిల్లల కుటుంబాలు లబ్ది పొందాయని వివరించారు.
95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా...
వివిధ ప్రభుత్వ శాఖల్లోని 80,039 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తున్నామనీ, 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా లోకల్‌ కేడర్‌ వ్యవస్థను రూపొందించుకున్నట్టు తెలిపారు. 2014 జూన్‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకు 1,41,735 ప్రత్యక్షనియామకాల భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యిందనీ, మొత్తంగా 2,21,774 ఉద్యోగ నియామకాలు చేపట్టి రాష్ట్రం రికార్డు సృష్టిస్తున్నదని వివరించారు. మిషన్‌ భగీరథ, దళితబంధు, ఆసరా పించన్లు, మత్స్యకారులు, నేత, గీత కార్మికులు, మహిళా సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, విద్యా, వైద్యరంగాల అభివృద్ధి, పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం, యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం, నూతన సచివాలయానికి అంబేద్కర్‌ పేరు, శాంతి భద్రతల పరిరక్షణ సహా పలు అంశాలను గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మతోన్మాద బీజేపీకి గోరికడదాం
కూపీ లాగుతున్న సిట్‌
పీక్‌లో 20శాతం...ప్రజలపై భారం
మోడీ-షాల కుట్రలు సాగవు
సహజవనరులను అదానీకి కట్టబెడుతున్న బీజేపీ
నేడు 'వెన్నెల' ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం
మహిళా వికలాంగుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి
బీజేపీ నామరూపాల్లేకుండా పోవడం ఖాయం
ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్కులో పక్షుల వీక్షణ కార్యక్రమం
కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలోనే క్రమబద్ధీకరిస్తాం
కాంగ్రెస్‌లోకి డీఎస్‌
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
శ్రీచైతన్య ప్రైమరీ విద్యార్థుల అద్భుత ప్రదర్శన
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతివ్వాలి
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి
లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి
పేపర్‌ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి : వైఎస్‌ షర్మిల
ఉద్యోగులను బెదిరించడం తగదు
వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి
ఇక రైతు తుఫాన్‌ ఎవరూ ఆపలేరు
దొంగలను విమర్శిస్తే జైలుకా..?
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎమర్జెన్సీ కంటే దారుణం
రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి
రాష్ట్రంలో బీజేపీ అంటు కూడా ఉండొద్దు
బీజేపీని ఓడించి తీరుతం
ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
పారిశ్రామిక రంగంలో మరింత సాధికారత

తాజా వార్తలు

08:20 PM

ఓటర్ల నమోదు, సవరణల కోసం కొత్త పోర్టల్

08:14 PM

మామిడిపల్లి నూతన వీడీసీ సభ్యులకు సన్మానం..

08:13 PM

బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్..

08:10 PM

ఆటోను ఢీకొన్న డీసీఎం..ముగ్గురు మృతి

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.