Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధ్యాయులపై దమనకాండ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 13,2020

ఉపాధ్యాయులపై దమనకాండ

- అడుగడుగునా పోలీసుల నిర్బంధం
- స్కూళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్న ఖాకీలు
- జిల్లా, మండల నాయకుల ముందస్తు అరెస్టు
- భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం
- గతంలో ఎప్పుడూ లేని విధంగా అణచివేత
- నేడే ఉద్యోగుల 'చలో అసెంబ్లీ'
- అరెస్టులకు ఐక్యవేదిక ఖండన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
పీఆర్సీ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎప్పుడూ లేని విధంగా నేరుగా పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. జిల్లాలు, మండలాల్లో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఉపాధ్యాయ సంఘాల నాయకులను ముందస్తుగానే పోలీసులు అరెస్టులు చేశారు. పాఠాలు బోధిస్తున్నా లాక్కెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి నియంతృత్వ పాలన గతంలో ఎప్పుడూ చూడలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు వాపోతున్నారు. ఉపాధ్యాయులపై ఉక్కుపాదం సరైంది కాదన్నారు. హక్కుల సాధన కోసం ఉద్యమాలే శరణ్యమనీ, ప్రభుత్వం దమనకాండ ప్రయోగించడాన్నీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చలో అసెంబ్లీకి వెళ్లనీయకుండా సకల చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులను పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లి చలో హైదరాబాద్‌కు వెళ్తే కేసులు నమోదవుతాయనీ, అనవసరంగా ప్రభుత్వంతో కొట్లాట ఎందుకనీ పోలీసు అధికారులు అంటున్నట్టు తెలిసింది. చలో అసెంబ్లీ కార్యక్రమం యథాతథంగా చేపడతామని ఐక్యవేదిక ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌కు తరలిరావాలని ఐక్యవేదిక పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పీఆర్సీపై ప్రకటన చేయకుండా అరెస్టులా? : ఐక్యవేదిక
పీఆర్సీపై ప్రకటన చేయకుండా ఉపాధ్యాయులను అరెస్టులు చేయడం సరైంది కాదని ఐక్యవేదిక స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె లక్ష్మయ్య, జి సదానందంగౌడ్‌, చావ రవి, సంపత్‌కుమారస్వామి, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, కె కృష్ణుడు, ఈ లక్ష్మణ్‌నాయక్‌, బాలస్వామి, అశోక్‌కుమార్‌, మాణిక్‌రెడ్డి తెలిపారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదులనో, నేరస్తులనో అరెస్టు చేసినట్టు ఉపాధ్యాయులు విధినిర్వహణలో ఉన్నపుడు బలవంతంగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించడం అప్రజాస్వామికమని విమర్శించారు. చలో అసెంబ్లీకి ఇన్ని అడ్డంకులు సృష్టించే బదులు పీఆర్సీపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఐదేండ్లకోసారి పీఆర్సీ అమలు చేయడం ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పీఆర్సీపై కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టులు, భయభ్రాంతులతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఏపీలో ఇలాగే అణచివేత కొనసాగితే తెలంగాణ వచ్చేదా?అని టీఎస్‌పీటీఏ అధ్యక్షులు షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి చెన్నరాములు ప్రశ్నించారు. ఉపాధ్యాయుల అరెస్టులు అక్రమమని ఎస్జీటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రావు, మహిపాల్‌రెడ్డి ఖండించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'డబుల్‌' ఆక్రమణకు ర్యాలీ అడ్డుకున్న పోలీసులు
బొగ్గు ఉత్పత్తిలో చేతులెత్తేసిన కేంద్రం
డీవైఎఫ్‌ఐ అఖిల భారత కార్యదర్శివర్గసభ్యులుగా ఆనగంటి వెంకటేష్‌
డ్రగ్స్‌ సరఫరాలో సూత్రదారులెవరు?
మున్సిపాల్టీల్లో స్థానిక సమస్యలను పరిష్కరించాలి
ఏజెన్సీలో మళ్లీ మొదలైన పోడు రగడ
వేసవిలో సంతృప్తికరంగా తాగునీటి సరఫరా : కృపాకర్‌రెడ్డి
బీఓబీ క్యాషియర్‌ కోర్టులో లొంగుబాటు
పేదల సొంతింటి కల సాకారం
ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల
కల్లాలే చెరువులై...
తడిసిన ధాన్యాన్ని కొనాలి
సీసీ కెమెరాల నిఘా మధ్య 'పది' పరీక్షలు
మే 21నుంచి రైతు రచ్చబండ
అక్రమంగా అరెస్టు చేశారు : ఎన్‌పీఆర్‌డీ
వచ్చే జనవరి నాటికి విజయవాడ-నాగ్‌పూర్‌ హైవే టెండర్లు
ధర్నా
జీరో అడ్మిషన్‌
ఇంటర్‌ మూల్యాంకనం పారితోషికం పెంచినందుకు ధన్యవాదాలు
అండమాన్‌ దీవులు, బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు
కరెంటు చార్జీలు తగ్గించండి : చాడ
మహిళల రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత : ఎమ్మెల్సీ కవిత
టైర్‌-2 సిటీలకూ ఐటీ విస్తరణ : కేటీఆర్‌
అందుబాటులో ఉన్న స్పాట్‌లకు వెళ్తాం
దగ్గర్లోని స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో చేరే అవకాశమివ్వాలి
బుద్ధుడి బోధనలు అనుసరణీయం : సీఎం కేసీఆర్‌
పని ప్రదేశంలో వడదెబ్బకు గురై.. ఉపాధి కూలీ మృతి
పదోన్నతల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలి : టీఎంఎస్‌టీఏ
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించాలి
మేం కట్టిందెంత?...మీరిచ్చిందెంత?

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.