Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సేవలు చిరస్మరణీయం | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 01,2022

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సేవలు చిరస్మరణీయం

- భూపాలపల్లి ఎస్పీ సురేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
బ్రిటిష్‌ పాలన అనంతరం ఎన్నో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూభాగాన్ని తన చాణిక్యంతో దఢమైన నిర్ణయాలతో ఏకం చేసి దేశ రక్షణ కోసం, సమగ్రత కోసం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ జె.సురేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం పోలీసు కార్యాలయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఎస్పీ జాతీయ ఐక్యత దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి పటేల్‌ చిత్ర పటానికి పూలమాల వేసి, ఘన నివాళి అర్పించి పోలీ సు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాల భారతావని ఏకతాటి పై నడిపించి, భారత ప్రథమ హౌం శాఖ మంత్రిగా పనిచ ేసిన వల్లభాయ్‌ పటేల్‌ గారు ఎందరికో ఆదర్శమన్నారు. వారి పోరాటం తెలం గాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయుధంగా పని చేసిందని అన్నారు. కార్యక్రమంలో జి ల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, డిఎస్పీ ఏ. రాములు, సీఐలు రాజిరెడ్డి, జానీ నర్సింహులు, పెద్దన్న కుమార్‌, అజరు, జితేందర్‌ రెడ్డి, సంతోష్‌, సతీష్‌, డిపిఓ ఏవో ఆయూబ్‌ ఖాన్‌, సూపరింటెండెంట్‌ సోఫియా సుల్తానా, పాల్గొన్నారు.
సుబేదారి : భారతదేశపు ఉక్కు మనిషిగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పేరు గాంచారని, ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకుంటున్నా మని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్బంగా అధికారులు, సిబ్బంది చే జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతం త్య్రం వచ్చిన తర్వాత భారత తొలి ఉపప్రధాని, తొలిహోం మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తి నింపిన వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జేసీ సంధ్యారాణి, డిఆర్వో వాసు చంద్ర తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ చౌరస్తా : భారత దేశ ఉక్కుమనిషి మొట్టమొదటి ఉపప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న జరుపుకునే 'జాతీయ ఐక్యతదినోత్సవాన్ని కె.యు.సి రోడ్‌, హన్మకొండలోని ఏకశిల హైస్కూల్‌లో సోమ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ కు సంబంధించిన పలు రకాల ఉపన్యాస, వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకశిల హై స్కూల్‌ విద్యాసంస్థల చైర్మన్‌ శ్రీ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం మన దేశంలో ఉన్న అనేక సంస్థానాలను విలీనం చేయడానికి సర్థార్‌ చేసిన కృషి మరువలేని దన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్‌ బేతికొండల్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ బేతి శైలజారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ నీల సుష్మారెడ్డి, ఉపాధ్యాయులు వేణు, లక్ష్మి నారాయణ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి : సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఉక్కు సంకల్పమే నేటి భారతావనికి మార్గదర్శనమని జెడ్పిహెచ్‌ ఎస్‌ ప్రధానోపాధ్యాయులు నరసింహాస్వామి అన్నారు. సోమవారం మండలంలోని మొట్లపల్లి జెడ్పిహెచ్‌ఎస్‌లో నిర్వహించిన సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి పూలమాల వేసిన అనంతరం వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్‌సిసి ఆఫిసర్‌ రాజయ్య, ఎస్‌ఎంసి చైర్మన్‌ ఆలగోపాల్‌ రెడ్డి ఉపాధ్యాయులు సంపత్‌ కుమార్‌, సదానందం, వీరయ్య,ఉమారాణి, రవీందర్‌ శ్రీధర స్వామి, మధుసూదన్‌, రవి ప్రసాద్‌, సి అర్‌ పి వసంత, విద్యార్థులు పాల్గొన్నారు.
మల్హర్‌ రావు : జిల్లా నోడల్‌ ఆఫీసర్‌, తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డి. దేవరాజం ఆదేశాల మేరకు సోమవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి రవీందర్‌ ఆధ్వర్యంలో కళాశాలలో సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కోల్‌ బెల్ట్‌ : వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రన్‌ ఫర్‌ యూనిటీ ర్యాలీని నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జిఎం శ్రీనివాసరావు హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ జిఎం కార్యాలయం నుండి అంబేద్కర్‌ చౌరస్తా వరకు కొనసాగింది. ఎస్‌ ఓ టు జి ఎం విజయ ప్రసాద్‌, ఎజీఎంలు జోతి, రామలింగం, ఏరియా అధికార ప్రతినిధి తుకారం, ఏరియా సర్వే అధికారి రాజగోపాల్‌, ఐటీ మేనేజర్‌ రజనీకుమారి, పిఓ శ్యాంప్రసాద్‌ పాల్గొన్నారు.
శాయంపేట : మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడిచి వారి ఆశయాలను కొనసాగించాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని పురస్కరించుకొని సోమవారం వారి చిత్రపటాలకు ఆయన పూలమాలవేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు నిమ్మల రమేష్‌, రాజేందర్‌, రఫీ, రాజు, విష్ణు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురు కుల పాఠశాలలో, కాట్రపల్లి సిఎస్‌ఐ పాఠశాలలో సర్దార్‌ వల్లభారు పటేల్‌ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవ హారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ సుభాషిని, నెహ్రు యువ కేం ద్ర కోఆర్డినేటర్‌ సునీల్‌ నాయక్‌, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్పొరేటర్ల భూకబ్జాలపై నజర్‌..
విద్యుత్‌ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలి
గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న కబ్జా పర్వం....
మనోధైర్యం కలిగి ఉండాలి : ఎస్‌ఓ లక్ష్మి
సెగ్రిగేషన్‌ షెడ్‌ను డీఎల్పీఓ సుధీర్‌ పరిశీలన
'మన ఊరు-మన బడి'పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ముమ్మరంగా కంటి వెలుగు కార్యక్రమం
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి : ఉద్యానశాఖ అధికారి
ఘనంగా పద్మశాలి మార్కండేయ జయంతి
సమయ పాలన పాటించట్లేదని ఆందోళన
అప్‌గ్రేడేషన్‌ కోసం భాషా పండితుల నిరసన
రాపెల్లికోట, ఎన్కపల్లి గ్రామాలకు బస్సు ప్రారంభం
రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలి
తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ల కాంట్రాక్టర్‌ ఎవరు ? : బీఎంఎస్‌
హాస్టల్‌ వర్కర్స్‌ పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి : సీఐటీయూ
పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయం
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
వెంకటేశ్వర్లును పరామర్శించిన కాంగ్రెస్‌ నాయకులు
అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు
ప్రజా వినతులు సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్‌ కె.శశాంక
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
యువత స్వయం ఉపాధితో ఎదగాలి
గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తాం : గుడిపూడి నవీన్‌
మా భూములు మాకు ఇప్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
అక్రమ మట్టి తవ్వకాలు ఆపాలి
మతోన్మాదుల మూకదాడులను అరికట్టాలి

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.