Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొలీజియం వ్యవస్థ ఏర్పాటు చేయాలి | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

కొలీజియం వ్యవస్థ ఏర్పాటు చేయాలి

- ఈడి, ఐటీ, సీబీఐ దాడులతో ఫెడరల్‌ వ్యవస్థ దుర్వినియోగం
- గవర్నర్ల వ్యవస్థ రద్దు కోసం 7న ఛలో రాజ్‌ భవన్‌
- బండి సంజయ్‌ రాజకీయ అజ్ఞాని
- బీజేపీపై వైఖరి మారకుంటేనే టీఆర్‌ఎస్‌ తో పనిచేస్తాం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
            కేంద్ర ఎన్నికల కమిషన్‌ విషయంలో కూడా కొలీజియంవంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకమిషనర్‌ నియామకంలో కేంద్రం అత్యుత్సాహం ప్రదర్శించిందని, స్వయంగా సుప్రీంకోర్టు నియామకాన్ని తప్పుపట్టిందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎనిమిదేండ్లలో ఎనిమిది మందిని ఎన్నికల కమిషనర్‌లను మార్చిందని, అందుకే ఈసికి కూడా కొలీజియం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈసి,ఈడి,సిబిఐ,ఐటి లాంటి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థలను మోడీ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షపార్టీల  ప్రభుత్వాలపై,ప్రజాప్రతినిధులపై దాడులను చేయిస్తున్నదన్నారు. దానికి ప్రతిగా రాష్ట్రాలు కూడా ఏసీబీ, విజిలెన్స్‌ వంటి వాటిని ఉప యోగిస్తూ ప్రతిదాడులకు పాల్పడుతున్నాయని, తద్వారా దేశం లో ఫెడరల్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ అధికార పిపాసిలా తయారయ్యారని, నియంతలా పరిపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రధాని అయిన మోడీ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ప్రతిపక్ష ముక్త్‌భారత్‌ అనేలా వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చివేసారని ఆరోపించారు. అక్కడితో ఆగ కుండా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌తో పాటు తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, అందులో భాగంగానే షిండేలాంటి వారు పుట్టుకొస్తున్నారని అన్నారు. మరోవైపు తమ మాటవినని రాష్ట్ర ప్రభుత్వా లపై గవర్నర్ల వ్యవస్థ ద్వారా పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఈ క్రమంలో ఈనెల 26న తాము రాజ్యాంగపరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, అలాగే గవర్నర్ల వ్యవస్థ రద్దు కోరుతూ డిసెంబర్‌ 7న సీపీఐ ఆధ్వర్యంలో ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
బీజేపీపై వైఖరి మారకుంటేనే టీఆర్‌ఎస్‌ తో కలిసి పనిచేస్తాం
భవిష్యత్‌లోనూ టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తాం కానీ అది టీఆర్‌ఎస్‌ చేతిలోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ పై టీఆర్‌ఎస్‌ ఇలాగే పోరాటం చేస్తేనే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మెంటల్‌ క్రిష్ణ సినిమా లో పోసానిమురళీకృష్ణకు నకలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అని చట్టాలు తెలియని అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసులో అమిత్‌షాను రప్పిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. అమిత్‌షాకు సిట్‌ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్‌రావు హత్యను తాము ఖండిస్తున్నామన్నారు. పోడుభూ ముల సమస్యకు హత్యలు పరిష్కారం కాదని, ప్రభు త్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
ఇండ్ల స్థలాలు, విభజన హామీల కోసం పోరాడుతాం
వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో వేలాది మం ది పేదలు సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారందరికీ వందగజాల ఇంటి స్థలం ఇచ్చి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్ర విభజనసమయంలో ఇచ్చినహామీలైన కాజీపే ట కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు లో గిరిజన యూనివర్శిటీ, మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ సా ధన కోసం సీపీఐ పోరాడుతుందని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు,మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, రాష్ట్ర నాయకులు టి. వెంకట్రాములు, నేదునూరి జ్యోతి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, షేక్‌ బాష్‌ మియా, నాయకులు ఆదరి శ్రీనివాస్‌, మద్దెల ఎల్లేష్‌, మండ సదాలక్ష్మి, దండు లక్ష్మణ్‌, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్‌, కొట్టెపాక రవి,వెంకటరమణ, బి.సంతోష్‌, ప్రసన్న, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌పై కౌన్సిలర్ల అవిశ్వాసం
గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలి
ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్‌
గొర్లకు బదులు నగదు బదిలీ చేయాలి : జీఎంపీఎస్‌
6న రేవంత్‌రెడ్డి హత్‌ సే హత్‌ పాదయాత్ర
ఉద్యమాల గడ్డ... భూపాలపల్లి అడ్డా...
'ఉపాధిహామీ'కి భారీ కోతలు విధించడం దుర్మార్గం
నిరుద్యోగ యువతను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం
ఎర్రజెండాతోనే నిరుపేదల సమస్యలు పరిష్కారం
ఏసీడీ పేరుతో వినియోగదారులపై అదనపు భారం
వ్యాపారస్తులు లైసెన్స్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
అసంఘటిత రంగ కార్మికులందరికీ ఇళ్లు ఇవ్వాలి : సీఐటీయూ
ఆదివాసీ గ్రామాన్ని ఖాళీ చేయించే హక్కు ఎవరికి లేదు
పోడు సాగు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి
పొంగులేటి సైన్యాన్ని గెలిపించడమే ఎజెండాగా పనిచేస్తాం
విభజన హామీల అమలుకు సీపీఐ భారీ పాదయాత్ర : టి శ్రీనివాస్‌
మాదకద్రవ్యాల వినియోగంతో అనేక అనర్థాలు
సమ్మక్క సారలమ్మ మినీ జాతర @ 3వ రోజు
వెట్టి చాకిరీలో పంచాయతీ కార్మికులు
ఉల్లాసంగా రెడ్‌ కలర్‌ డే
స్టేషన్‌ ఎదుట మహిళా సంఘాల సభ్యుల ఆందోళన
నిరుపేద ఎస్సీలు అందరికీ దళితబంధు ఇవ్వాలి
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
టీచర్‌ రాజేశ్వరీ వెంటనే సస్పెండ్‌ చెయ్యాలి : ఎస్‌ఎఫ్‌ఐ
గణిత ఉపాధ్యాయుడు మాకొద్దు
సర్కార్‌ బడులలో సకల వసతులు : మంత్రి ఎర్రబెల్లి
ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పనిచేయాలి
కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలి : ఐఎఫ్‌టీయూ
విద్యుత్‌ కోతలతో రైతులకు తప్పని తిప్పలు

తాజా వార్తలు

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ.. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి

07:25 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.