Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మృత్యుకంపం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

మృత్యుకంపం

- ఆఫ్ఘన్‌లో పెను విషాదం
- వెయ్యి మందికి పైగా మృతి.. మరింత పెరిగే అవకాశం
- భూకంపంతో భారీగా ఆస్థి, ప్రాణ నష్టం
- రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదు
- దాదాపు 1500 మందికి గాయాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
                ఆఫ్ఘనిస్థాన్‌ భూకంపంతో వణికింది. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరిత్యం ఆ దేశంలోని తూర్పు ప్రావిన్సులైన పక్తికా, ఖోస్ట్‌ లలో తీవ్ర ఆస్థి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. దీంతో వందలాది మంది ప్రజలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. భూకంపం ధాటికి ఇనేక ఇండ్లు నేలమట్టమయ్యాయి. శిధిలాల్లో వందలాది సంఖ్యలో మృతులు, క్షతగాత్రులు చిక్కుకుపోయి ఉన్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మారుమూల కొండ ప్రాంతంలోని భూకంపం సంభవించటంతో సమాచార సేకరణ సంక్లిష్టంగా మారింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తున్నదని అక్కడి అధికారులు చెప్పారు. అక్కడి తాలిబన్‌ ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించి కొనసాగిస్తున్నది.
కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌పై ప్రకృతి ప్రకోపం చూపించింది. ఆ దేశంలోని తూర్పు ప్రావిన్సులైన పక్తికా, ఖోస్ట్‌లలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదైంది. భూకంపం ధాటికి వెయ్యి మందికి పైగా మరణించారు. దాదాపు 1500 మంది వరకు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నదని ఆ దేశ సమాచార సాంస్కృతిక విభాగం అధిపతి మహమ్మద్‌ అమీన్‌ హుజైఫా తెలిపారు.
           భూకంప తీవ్రత పక్తికా ప్రావిన్సులో అధికంగా కనిపించింది. ఈ ప్రావిన్సులోనే అధిక మరణాలు నమోదయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు. ఇక్కడ 255 మంది వరకు మృతి చెందగా.. 200 మందికి పైగా గాయాలపాలైనట్టు తాలిబన్‌ ప్రభుత్వంలోని అంతర్‌ మంత్రిత్వ శాఖ అధికారి సలాహుద్దీన్‌ అయూబ్‌ వెల్లడించారు. పక్తికా ప్రావిన్సులోని నాలుగు జిల్లాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నదని అధికారులు తెలిపారు. బర్మల్‌, జిరుక్‌, నాకా, గ్యాన్‌ జిల్లాల్లో శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను బయటకు తీయడానికి భద్రతా దళాల హెలికాప్టర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని ఆఫ్ఘనిస్థాన్‌ స్టేట్‌ న్యూస్‌ ఏజెన్సీ రిపోర్టర్‌ అబ్దుల్‌ వాహిద్‌ ర్యాన్‌ ట్వీట్‌ చేశారు. నంగర్‌హర్‌ ప్రావిన్సులో 25 మరణాలు నమోదైనట్టు అధికారులు వివరించారు. ''కొన్ని గ్రామాలు మారుమూల పర్వత ప్రాంతాల్లో ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. వారి సమాచార సేకరణకు కొంత సమయం పడుతుంది. అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. క్షతగాత్రులను చేరుకోవటానికి, మెడికల్‌ సప్లరు, ఆహారం చేరవేయడానికి హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి'' అని అయూబ్‌ తెలిపారు.
ఆఫ్ఘన్‌ ప్రధాని అత్యవసరం సమావేశం
           భూకంపం ఇక్కడి ప్రాంతంలో అనేక ఇండ్లను నేలమట్టం చేశాయని తాలిబన్‌ ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి బిలాల్‌ కరీమీ చెప్పారు. విపత్తు తదుపరి తీవ్రతను తగ్గించటం కోసం ప్రభావిత ప్రాంతాలకు బృందాలను పంపాలని సహాయక ఏజెన్సీలను కోరినట్టు వివరించారు. పక్తికా, ఖోస్ట్‌ ప్రాంతాలలో సహాయక చర్యలపై సమన్వయం కోసం ఆఫ్ఘనిస్థాన్‌ ప్రధాని మొహమ్మద్‌ హస్సన్‌ అఖుంద్‌ ఆ దేశ రాజధాని కాబూల్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పాక్‌, భారత్‌లలోనూ ప్రకంపనలు
           ఆఫ్ఘనిస్థాన్‌కు ఆగేయాన ఖోస్ట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్టు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఇది భూమి ఉపరితలం నుంచి 51 కిలోమీటర్ల లోతు ఉన్నట్టు వివరించింది. ఆఫ్ఘన్‌కు పొరుగుదేశం పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సు, భారత్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తున్నది. అయితే, ఇక్కడ ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టాలు మాత్రం జరగలేదు. ఆఫ్ఘన్‌లో భూకంప మృతుల సంఖ్య పెరిగుతుండటంపై పాకిస్థాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.
ప్రపంచదేశాల సహకారాన్ని కోరిన ఆఫ్ఘన్‌
           ఆఫ్ఘన్‌ను గతేడాది తాలిబన్‌ తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం అనే అంతర్జాతీయ సహాయక ఏజెన్సీలు ఆఫ్ఘనిస్థాన్‌ విడిచి వెళ్లాయి. దీంతో సహాయక చర్యలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తున్నది. కాగా, తమకు అంతర్జాతీయ సమాజం సహకారం కావాలని ఆఫ్ఘనిస్థాన్‌ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రపంచ దేశాలను కోరింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ ములాఖాత్‌
మానవ హక్కులు మాయం
జీ 7 సదస్సుకు నిరసన సెగ ..
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగింపు
పాక్‌లో భారీ పరిశ్రమలకు సూపర్‌ ట్యాక్స్‌
బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం
బ్రిటన్‌లో రైల్వే సమ్మె
విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో చారిత్రక విజయం
యూనియన్‌లో చేరిన ఆపిల్‌ కార్మికులు
మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా
అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్‌
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం : జిన్‌పింగ్‌
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు
శ్రీలంకలో మూడేళ్ల వరకూ కరెంటు కోతలు : ఇంజనీర్ల హెచ్చరిక
జీడీపీ అంచనాలకు ఫెడ్‌ కోత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే చర్యలు చేపట్టాలి
కువైట్‌ చట్టాలను ప్రవాసులు గౌరవించాల్సిందే !
మత్స్య కార్మికుల సబ్సిడీకి ఎగనామం
మహమ్మద్‌ ప్రవక్త గౌరవం విషయంలో రాజీపడం
పశ్చిమ దేశాల ఆయుధాల డిపోను ధ్వంసం చేశాం : రష్యా
ముందే హెచ్చరించాం... జెలెన్‌స్కీ వినలేదు
ఏజియన్‌ దీవుల సైనికీకరణ ఆపండి
పసిఫిక్‌ ద్వీప దేశాలతో సహకారానికి సిద్ధంగా వున్నాం : చైనా వెల్లడి
చాద్‌లో ఆహార అత్యవసర పరిస్థితి !
నైజీరియాలో నరమేధం
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం
మీరు తప్పులు చేసి మమ్మల్ని నిందిస్తారా?
అధిక ధరల నుంచి ఊరట కోసం కనీస వేతనాల పెంపు!
భారత్‌లో మత స్వేచ్ఛకు ముప్పు

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.