నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తిలో చేతులెత్తేసి రాష్ట్రాలకే ఉత్పత్తి బాధ్యతను అప్పగించడం ద్వారా దేశాన్ని అంధకారంలోకి నెట్టిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారాలు మోపిందని విమర్శించారు.